సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ వస్తున్నారని, లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మంత్రి అల్లోల కలెక్టర్ వరుణ్రెడ్డి, అధికారులతో కలిసి నూతన కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, బహిరంగ సభా స్థలం, హెలీప్యాడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జూన్ 2 వరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే సీఎం కేసీఆర్ పర్యటన అనంతరం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లాకు రానున్నారని, ఆయిల్ పామ్ ఇండస్ట్రీతోపాటు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
– నిర్మల్ అర్బన్, మే 28
నిర్మల్ అర్బన్, మే 28 : సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ వస్తున్నారని, పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం మంత్రి, కలెక్టర్ వరుణ్రెడ్డి, అధికారులతో కలిసి నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, బహిరంగ సభ నిర్వహించే స్థలం, హెలీప్యాడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా కేంద్రంలో లక్ష మందితో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎల్లపెల్లి గ్రామ శివారులోని క్రషర్ రోడ్డులోని అనువైన స్థలంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో తొమ్మిదేండ్లుగా ప్రజలకు అందుతున్న వివిధ పథకాలపై కేసీఆర్ ప్రసంగిస్తారన్నారు.
కేసీఆర్ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చా రు. జూన్ 2వ తేదీ వరకు అన్ని ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మెడికల్, నర్సింగ్ కళాశాలలు మంజూరయ్యాయని, రూ.166 కోట్లతో కళాశాల భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. అలాగే ఇంజినీరింగ్ కళాశాలను కూడా తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. రూ.30 కోట్లతో మైనార్టీ రెసిడెన్షియల్ భవనాన్ని నిర్మించుకున్నామని, జూలైలో విద్యార్థులకు అందుబాటులోకి రానుందని తెలిపారు. అలాగే సీఎం కేసీఆర్ పర్యటన అనంతరం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లాకు రానున్నారని, ఆయిల్ పామ్ ఇండస్ట్రీతోపాటు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, యువ నాయకులు అల్లోల గౌతంరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, అల్లోల తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.