“సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ముందు వరుసలో ఉందని, ఇది జీర్ణించుకోలేని కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ అవస్థల పాలు చేస్తున్నదని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యోగుల సంక్షేమాన్ని మరువమని” అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్లో ఉమ్మడి జిల్లా సహకార ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సహకార ఉద్యోగులకు హెచ్ఆర్సీ పాలసీ, ఇతర సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
నిర్మల్ టౌన్, జనవరి 4 : కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ఉద్యోగుల సంక్షేమాన్ని మరువబోమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి అధ్యక్షతన నిర్మల్జిల్లా కేంద్రంలోని దివ్యగార్డెన్లో ఉమ్మడి జిల్లా సహకార ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉద్యోగుల గౌరవాధ్యక్షుడు రూప్సింగ్ ఆధ్వర్యంలో సహకార ఉద్యోగులకు హెచ్ఆర్సీ పాలసీ, ఇతర సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 90వేల ఉ ద్యోగాల భర్తీ లక్ష్యంగా వివిధ నోటిఫికేషన్లను ఇచ్చిందన్నారు.
సహకార వ్యవస్థను బలోపేతం చేయాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి నూతన హెచ్ఆర్సీ పాలసీని జనవరి 1 నుంచి అమలు చేశారని గుర్తు చేశారు. గౌరవాధ్యక్షుడు రూప్సిం గ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సహకార బ్యాంకులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్న ఉద్యోగులకు హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయడంపై సంతోషంగా ఉన్నారని తెలిపారు. సహకార సంఘాలకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఎరువుల పంపి ణీ, వ్యాపార విస్తరణ కోసం సహకరిస్తున్నదని చెప్పారు. సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో 280 మంది సహకార ఉద్యోగులు హెచ్ఆర్సీ పాలసీతో ప్రయోజనం పొందారని గుర్తు చేశా రు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా ఉద్యోగులందరూ బీఆర్ఎస్ కార్మిక సం ఘంగా ఏర్పడి ప్రభుత్వానికి చేదోడుగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ నారాయణరెడ్డి, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, డీసీవో శ్రీనివాస్రెడ్డి, వ్యవసాయశాఖ జిల్లా అధికారి అంజిప్రసాద్, సహకార శాఖ చైర్మన్లు హరీశ్కుమార్, కృష్ణప్రసాద్రెడ్డి, నారాయణ, గజ్జారాం, ముత్యం, మాణిక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించండి
రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఇంటికీ చేరుకున్నాయని, ఆ పథకాలు పొందిన వారంతా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవన్లో నిర్మల్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన 204 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.2.4 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశా రు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ చూసిన ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తూ కక్షసాధింపు ధోరణితో నిధులు ఇవ్వకుండా సంక్షేమాన్ని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ వెంకట్రామ్రెడ్డి, సారంగాపూర్ ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, లక్ష్మణచాంద జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
విద్యార్థులు ప్రదర్శనలపై దృష్టి సారించాలి
నిర్మల్ అర్బన్, జనవరి 4 : విద్యార్థులు చదువుతో పాటు వైజ్ఞానిక ప్రదర్శనలపై దృష్టి సారించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నా రు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ ఫేయిర్ను ఆయన ప్రా రంభించారు. జిల్లాలోని 17 పాఠశాలల విద్యార్థులు ప్రదర్శనలిచ్చారని, ఇం దు లో ప్రతిభ కనబర్చిన వారు త్వరలో ఉ మ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదిత రులు పాల్గొన్నారు.
జంగుబాయి ఉత్సవాలకు రావాలని మంత్రికి ఆహ్వానం
నార్నూర్, జనవరి 4 : కుమ్రం భీం జిల్లా కెరమెరి మండలంలోని పరందోళి శివారులో కొలువుదీరిన ఆదివాసీల ఆరాధ్యదైవం జంగుబాయి మహోత్సవాలకు రావాలని జంగుబాయి దేవస్థానం కమిటీ సభ్యులు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కోరారు. నిర్మల్లోని మంత్రి స్వహగృహంలో బుధవారం ఐకే రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆహ్వాన పత్రం అందజేశారు. అనంతరం గోడ ప్రతులను ఆవిష్కరించారు. జంగుబాయి మహోత్సవాలకు వస్తానని మంత్రి చెప్పినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొడప జాకు, మాజీ చైర్మన్ మరప బాజీరావ్, మండాడి దౌలత్రావ్ తదితరులు పాల్గొన్నారు.
బోథ్ ఎమ్మెల్యేకు పరామర్శ
ఎదులాపురం, జనవరి 4 : బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. బావురావ్ సోదరుడు రాథోడ్ బిక్కు నాయక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దిలాబాద్లోని ఎమ్మెల్యే బావురావ్ నివాసానికి బుధవారం వెళ్లారు. బిక్కు నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి వెంట ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ఉన్నారు.