నిర్మల్ అర్బన్, జనవరి 3 : కంటి సమస్యలు దూరం చేయాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. రెండో దఫా జనవరి 18 నుంచి నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.
హైదరాబాద్ నుంచి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధ్యక్షతన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి అల్లోల పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుండడంతో ప్రజాప్రతినిధులు భాగస్వాములై ముందుకెళ్లాలని హరీశ్రావు సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పాల్గొన్నారు.