Chain Snatching : కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో దారుణం జరిగింది. ఇద్దరు బైకర్లు (Bikers) రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళపై దాడిచేసి 25 గ్రాముల బంగారాన్ని లాక్కెళ్లారు. ఈ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది. షాప్ మూసుకుని ఇంటికి వెళ్తున్న మహిళను బైక్పై వచ్చిన దుండగులు టార్గెట్ చేశారు. ఆమెను కిందపడేసి, మెడలోని 25 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లారు. ఈ ఘటన దొడ్డబిదరకల్లు ప్రాంతంలో జరిగింది.
బాధితురాలు విజయమ్మ దొడ్డబిదరకల్లు ప్రాంతంలో పాల దుకాణం నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ఐదు గంటలకు దుకాణాన్ని మూసివేసి ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఆ సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై దాడిచేశారు. ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని లాక్కున్నారు. దుండగులు లాగడంతో విజయమ్మ కిందపడిపోయారు. సహాయం కోసం గట్టిగా కేకలు వేశారు. అయితే తెల్లవారుజాము కావడంతో చుట్టుపక్కల ఎవరూ లేరు.
ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. బైక్పై వచ్చిన వ్యక్తులు మహి దాడిచేసి, నగలతో పరారవుతున్న దృశ్యాలు కనిపించాయి. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
CCTV captures brutal chain snatching in Bengaluru
A woman was assaulted and robbed of her 25 gram mangalsutra by two bike borne men near Doddabidarakallu in Peenya.
The victim, Vijayamma, was walking to a shop around 5:10 AM when the pillion rider attacked her, dragged her to… pic.twitter.com/FZ4wC8tNDN— Imran Khan (@KeypadGuerilla) August 13, 2026