కాగజ్నగర్ ఎస్పీయం కాలనీ, మార్చి 11: కాగజ్నగర్ పురపాలక సంఘ అభివృద్ధికి అధికారులు, పాలకవర్గం సమన్వయంతో పని చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. సోమవారం కాగజ్నగర్ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమావేశం నిర్వహించారు.
సిర్పూర్ ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్బాబు, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ షాహిన్ సుల్తానా, వైస్ చైర్ పర్సన్ స్వామిశెట్టి రాజేందర్తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సం దర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పురపాలక సంఘ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, అందుకనుగుణంగా ముందుకెళ్లాలని సూచించారు. పురపాలక సంఘ పరిధిలో వివిధ రకాల ట్రేడ్ లైసెన్సు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.