ఆదిలాబాద్, అక్టోబరు 11 (నమస్తే తెలంగా ణ) : ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని మరిచి ఆ పార్టీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎన్నికల్లో బీజేపీ పార్టీని ప్రజలు పాతర వేస్తారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నా రు. బుధవారంలో ఆదిలాబాద్లో ఆయన బీఆర్ ఎస్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం లో మాట్లాడారు. ఆదిలాబాద్ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆదిలాబాద్ పర్య టనలో పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. తన స్థాయి దిగజార్చుకుని చిల్లర నాయకునిలా వ్యవ హరిం చారని మండిపడ్డారు. ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ విషయంలో కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నదని, 2016లో తాను, మాజీ ఎంపీ నగేశ్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు ఢిల్లీలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి అనంత్గితేను కలిసి సీసీఐ ప్రారంభించా మని కోరామని తెలిపారు.
ఇందుకు సంబంధిం చిన రుజువులను ఆయన చూపించారు. పరిశ్రమ ప్రారంభమైతే తెలంగాణ ప్రభుత్వానికి పేరు వస్తుందని భావించిన అప్పటి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారం సీసీఐని సందర్శించి త్వరలో ప్రారంభిస్తామని ప్రకటించా రన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ 49-51 శాతం వాటాతో పరిశ్రమను ప్రారంభిస్తా మని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా రాష్ట్ర ప్రభు త్వం ఎంవోయూ చేయించుకోవడం లేదని తప్పు డు మాటాలు మాట్లాడుతున్నారని, ఇందుకు సంబంధించిన లేఖను చూపించాలని రామన్న డిమాండ్ చేశారు.
తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక బీజేపీ నాయకులు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సిమెంటు పరిశ్రమ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పలు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోకుండా పరిశ్రమను అమ్మకానికి పెడుతుందన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్య దర్శి బండి సంజయ్ తెలంగాణలో రుణ మాఫీ, పోడు పట్టాలు ఇచ్చిన ప్రభుత్వాని కి ఓటు వేయమని చెప్పినందుకు ధన్యవా దాలు తెలుపుతున్నామన్నారు. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు కేంద్ర మంత్రి అమిత్షాకు లేదని, కేసీఆర్ కుటుంబానికి ఉద్యమ నేపథ్యం ఉందని, తమ ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేసినట్లు తెలిపారు. క్రికెట్ అంటే తెలియని అమిత్ షా కొడుకు జైషా బీసీసీఐ పదవిలో ఎలా కొనసాగు తున్నారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీ పార్టీకి తగిని బుద్ధి చెబుతా రని పేర్కొన్నారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్టును కేంద్రం ఎందుకు ప్రారంభిం చడం లేదన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయ కులు అలాల అజయ్, సాజిదుద్దీన్, మెట్టు ప్రహ్లాద్, విజ్జిగిరి నారాయణ, గంగారెడ్డి, జంగిలి ప్రశాంత్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
ఎదులాపురం, అక్టోబర్ 11 : దేశంలో 68 సంవత్సరాలు పాలనలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే దేశాన్ని సర్వ నాశనం చేశాయని ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. గురువా రం జిల్లా కేంద్రంలోని వార్డు నంబర్ 19 లోని వరలక్ష్మీనగర్లో 300 మంది మతీన్ ఆధ్వర్యం లో బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే జోగు రామన్నకు కాలనీ వాసు లు ఘనస్వాగతం పలికారు. ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వనించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ దేశంలో అత్యధికంగా పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభు త్వాలు ధనికులను అత్యంత ధనికులను చేసింద ని, పేద వారిని మరింత పేదరికంలో నెట్టివేసింద న్నారు. బీజేపీ అధికారంలో వస్తే విదేశాలలో ఉన్న నల్ల డబ్బును ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు జమచేస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. మోదీ ఇదీ వరకు ఏ ఒక్కరికైనా రూ.15లక్షలు అకౌంట్లో వేశారా అని ప్రశ్నిం చారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెంచడం తప్ప పేద ప్రజలకు ఉపయోగపడే పని చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రైవేట్ రంగంలో 18 లక్షల పైగా, లక్ష 14వేల ప్రభుత్వ ఉద్యోగా లను కల్పించామని స్పష్టంచేశారు.
నిరుపేద ఆడ బిడ్డ పెళ్లిళ్లకు రూ.లక్ష116, ఆసరా పింఛన్లు రూ.2016, దివ్యాంగులకు రూ. 4016 ఇస్తున్నా మని తెలిపారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో సుమారుగా 36 వేలపైగా ఆసరా పింఛన్లు అంది స్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్ నియోజ కవర్గంలో 36 వేలకు పైగా ఇస్తున్నామని, ఆసరా పింఛన్ సాంకేతిక కారణాలతో కొంత మందికి అగిపోవడంతో ప్రతిపక్ష నాయకులు ఫించన్ ఇవ్వడం లేదని ఆందోళన చేయడం సరికాద న్నా రు. ప్రతి ఒక్కరికీ ఆసరా పింఛన్ ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల కోడ్ అయిపో యిన తర్వాత గృహలక్ష్మి కింద రూ.3 లక్షలు అకౌంట్లో జమ చేస్తామని పేర్కొన్నారు. ఎన్ని కల కోడ్ తర్వాత ఆలయాల, బుద్దవిహార్, మసీద్ ల అభివృద్ధ్దికి కృషి చేస్తామని కాలనీ వాసులకు భరోసా కల్పించారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అలాల్ అజయ్, సీనియర్ నాయకుడు సాజీద్ ఉద్దీన్, బీఆర్ఎస్ నాయకులు సలీంపాషా, వార్డు కౌన్సిలర్ రామేశ్వర్ మంగళబాయి పాల్గొన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారు అబిబ్, ముజాహిద్, అమర్, ఆసిఫ్, షాద్దు, అనిల్ పాల్గొన్నారు.
తెలంగాణలో విద్యా, వైద్యానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యాత ఇస్తున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఉచిత విద్యను అందిస్తున్నామని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఎంతో మంది అందులో చదివి ఉద్యోగాలు సాధించారని గుర్తు చేశారు. అలాగే కడుపులో ఉన్న బిడ్డ నుం చి వృద్ధుల వరకు వారికి సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని భరోసా కల్పించారు. వచ్చే ఎన్నిక ల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని మరో సారి గెలిపించాలన్నారు.
ఆదిలాబాద్లోని వరలక్ష్మీనగర్లో ఎమ్మెల్యే జోగు రామన్న సమక్షంలో యువత బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత యువత ఎమ్మెల్యేతో తమ ఫోన్లలో ఉత్సాహంగా సెల్ఫీలు తీసుకొని మురిసిపోయారు.
– ఎదులాపురం, అక్టోబర్11