మందమర్రి, ఫిబ్రవరి 16 : ప్రభుత్వ దవాఖానలకు వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూ గుప్తా సూచించారు. శుక్రవారం మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో గల పీహెచ్సీని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని విభాగాలను పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను డాక్టర్ రమేశ్ను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ దవాఖానలపై ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా విధులు నిర్వహించాలని సూచించారు.
బెల్లంపల్లిరూర్, ఫిబ్రవరి 16 : బెల్లంపల్లిలోని ఐటీడీఏ పండ్లతోటల నర్సరీని పీవో ఖుష్బూ గుప్తా పరిశీలించారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి వచ్చిన ఆమెకు ప్రాజెక్ట్ ఉద్యాన అధికారి గుడిమల్ల సందీప్కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. నర్సరీలోని మా మిడి, మల్లె, మునగ, ఇతర అలంకరణ మొక్కలను ఆమె పరిశీలించారు. సా గులో ఉన్న సపోట, మామిడి తోటలను ఆమె పరిశీలించి వాటి నుంచి మెరుగై న ఆదాయం రావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నారు.
ఉద్యానపంటలు సాగు చేసే రైతులకు ఐటీడీఏ ద్వారా సహకారం అందిస్తామని తెలిపారు. ఐటీడీఏ ప్రాంత అభివృద్ధి కోసం, గిరిజనరైతుల జీవన ప్రమాణాల ను మెరుగుపర్చడానికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి సుధీర్కుమార్, నర్సరీ టెక్నికల్ అసిస్టెంట్ పూజ, సిర్పూర్ పేపర్మిల్ అసిస్టెంట్ మేనేజర్ దేవరాజ్, సిబ్బంది రాజమల్లు, రాహుల్ పాల్గొన్నారు.