సారంగాపూర్/ భైంసాటౌన్, సెప్టెంబర్ 16 : ప్ర భుత్వ పాఠశాలల్లో పారదర్శకతకు పెద్దపీట వే స్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థుల హాజరు నమోదు చేసే ప్రక్రియను సరికొత్తగా చేపట్టేలా శ్రీ కారం చుట్టారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఎస్ఈ) ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం (ఎఫ్ ఆర్సీ) యాప్ ద్వారా విద్యార్థుల హాజరు తెలు సుకునేలా విద్యాశాఖ తయారు చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, వెల్పేర్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల హాజరును నిత్యం ముఖ ఆధారిత గుర్తింపు (ఫేషి యల్ రికగ్నైజేషన్) ద్వారా ఉపాధ్యాయులు నమో దు చేస్తున్నారు. జిల్లాలో యూడైస్లో నమోదైన 613 పాఠశాలలకు సంబంధించి విద్యార్థుల వివ రాలను రిజిస్ట్రేషన్ చేసి యాప్లో నిక్షిప్తం చేశారు. ఇంకా 105 పాఠశాల విద్యార్థుల రిజిస్ట్రేషన్ పొందు పర్చాల్సి ఉంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన పాఠశాలల్లో విద్యార్థుల పేర్లకు అనుగుణంగా వారి ముఖ చిత్రాలను పొందపర్చే ప్రక్రియను ఉపాధ్యా యులు వేగవంతం చేస్తున్నారు. పోలీస్, వైద్య ఆరోగ్యశాఖలు నిర్వహిస్తున్న మాదిరిగానే విద్యా శాఖ సైతం రాష్ట్రస్థాయిలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని చేయాలని నిర్ణయించింది. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు న మోదును ఈ వ్యవస్థ ద్వారా జిల్లా, రాష్ట్రస్థాయిలో పర్యవేక్షించే వీలు కలిగింది.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 718 ప్రభుత్వ పాఠశాలలు పని చేస్తున్నాయి. ఆయా పాఠశాలల్లో 47,461 మంది విద్యార్థులు విద్యను అభ్యసి స్తున్నారు. పేద వర్గాల విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు పలు ఉచిత, సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమ లు పరుస్తున్నది. విద్యార్థులు పాఠశాలలకు రాకు న్నా కొందరు ఉపాధ్యాయులు వారి హాజరు నమో దు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే ఫేషి యల్ రికగ్నైజేషన్ సిస్టం (ఎఫ్ఆర్సీ) హాజరు నమోదు ప్రక్రియతో బోగస్ హాజరు నమోదుకు తెరపడనున్నది. మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఇతర కార్యక్రమాల నిర్వహణ ఈ యాప్ ద్వారా పారదర్శకంగా అమలు కానున్నా యి. ఈ యాప్ను గూగుల్ ప్లే స్టోర్లో అందుబా టులో ఉంచారు. ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల లకు ట్యాబ్లను ఇదివరకే పంపిణీ చేసింది. ట్యాబ్ లు అందుబాటులో లేని పాఠశాలల్లో ఉపాధ్యా యులు తమ సొంత ఆండ్రాయిడ్ ఫోన్లను హాజరు నమోదుకు వినియోగిస్తున్నారు. తరగతి గదికి హా జరైన విద్యార్థులందరినీ యాప్లో సమూహంగా ఫొటో తీస్తే చాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఒక్కో విద్యార్థి హాజరు వ్యక్తిగతంగా నమో దవుతుంది. ఈ ప్రక్రియలో కొన్ని సందర్భాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. నెట్వర్క్ బిజీమూలంగా విద్యార్థుల ముఖ హాజరు చేయాలంటే చాలా సమయం పడుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఆయా సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో హెల్ప్లైన్ను ఏర్పాటు చేశారు. 85200 83979, 79955 50960 ఫోన్ నంబర్ల ద్వారా సాంకేతిక సమస్యలు పరిష్కరించుకునే వీలు కల్పించారు.
మొత్తం పాఠశాలలు – 718
మొత్తం విద్యార్థులు – 47,461
ప్రాథమిక పాఠశాలలు – 503
ప్రాథమికోన్నత పాఠశాలలు – 83
ఉన్నత పాఠశాలలు – 109
కేజీబీవీలు – 18
వెల్పేర్ పాఠశాలలు – 05
రిజిస్ట్రేషన్ చేసిన పాఠశాలలు- 613
రిజిస్ట్రేషన్ పూర్తి కాని పాఠశాలలు -105
రిజిస్ట్రేసన్ పూర్తయిన విద్యార్థులు -29,937
రిజిస్ట్రేషన్ పూర్తికాని విద్యార్థులు -17,524
రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల ప్రకారం ఐదు రోజుల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఫొటోలు తీసి ఫేషియల్ రికగ్నైషన్ అటెండెన్స్ (ఎఫ్ఆర్సీ) యాప్లో నమోదు చేస్తున్నాం. నిర్మల్ జిల్లాలో 718 ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం మధ్యాహ్నం వరకు 613 పాఠశాలల రిజిస్ట్రేషన్ పూర్తి చేశాం. మిగతా 105 పాఠశాలకు రిజిస్ట్రేషన్ను తొందరగా పూర్తి చేయాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన పాఠశాలల్లో విద్యార్థుల ముఖాన్ని ఫొటో తీసి ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరును నమోదు చేస్తున్నారు. దీనివల్ల ప్రతి రోజూ పాఠశాలకు ఎంత మంది విద్యార్థులు వస్తున్నారో తెలిసిపోతుంది. దీనివల్ల మధ్యాహ్నం భోజనం, ఇతరవి అమలు చేయడం వీలవుతుంది.
– రవీందర్రెడ్డి, డీఈవో, నిర్మల్