భైంసా, అక్టోబర్ 6 : భైంసాలో గురువారం దుర్గామాత ప్రతిమల నిమజ్జన వేడుకల శోభా యాత్ర ప్రశాంతంగా కొనసాగింది. విశ్రాంతి భవ నం ఎదుట, పురాణాబజార్లో గల యాదవ సంఘం దుర్గామాత మండపాల వద్ద ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఏఎస్పీ కిరణ్ ఖారే, హిందూ ఉత్సవ సమితి సభ్యులు పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ప్రధాన వీధుల గుండా యువ కుల నృత్యాలు, కోలాటలు, పోతరాజుల విన్యా సాల మధ్య శోభాయాత్ర కొనసాగింది. పట్టణ సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులో దుర్గామాత ప్రతిమలను నిమజ్జనం జరిపారు.
భారీ పోలీసు బందోబస్తు
దుర్గామాతల నిమజ్జనం సందర్భంగా గురు వారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ, ఏఎస్పీ, 300ల మంది పోలీసులు, మూడు స్పెషల్ పోలీసు టీమ్లు పాల్గొన్నాయి. యువకులు నృత్యాలు ఆకట్టుకున్నాయి. శోభా యాత్రలో కాషాయ జెండాలతో సందడి చేశారు. ఆయా రూపాల్లో ఉన్న దుర్గామాతలకు పట్టణ వాసులు పూజలు చేశారు. శోభాయాత్ర దృశ్యాల ను మహిళలు, చిన్నారులు డాబాలపై నుంచి తిలకించారు.భట్టిగల్లీలో తూమోల్ల దత్తాత్రి, మహా లక్ష్మి డ్రెస్సెస్, బాలాజీ సూత్రావే, గొల్ల కుర్మ ఆధ్వర్యంలో ప్రసాదాల వితరణ చేపట్టారు. నీటితో పాటు పులిహోర ప్యాకెట్లను అందజేశారు.
ముస్లింల అన్నదానం
భైంసాటౌన్, అక్టోబర్ 6 : భైంసా మండలం పెండ్పెల్లిలో దుర్గామాత నిమజ్జనాన్ని పురస్క రించుకొని ముస్లింలు గ్రామస్తులకు సొంత ఖర్చు లతో అన్నదానం ఏర్పాటు చేశారు. అన్ని మతాల కు చెందిన 4 వేల మంది పాల్గొన్నారు.