భీమారం, ఏప్రిల్ 27 : ధర్మారం, బూర్గుపల్లి గ్రామాల్లో శనివారం ఎట్టకేలకు ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘ఎక్కడి ధాన్యం అక్కడే.. ప్రారంభంకాని కొనుగోలు కేంద్రాలు’ పేరిట కథనం ప్రచురితమవ్వగా అధికారులు స్పందించారు.
ధర్మారంలో సబ్సెంటర్ను ఏర్పాటు చేశారు. బూర్గుపల్లి గ్రామంలో డీఆర్డీఏ పీడీ కిషన్ సెంటర్ను పరిశీలించారు. ధర్మారంలో కొనుగోళ్లు ప్రారంభించారు. ధర్మారం, బూర్గుపల్లిలోని కొనుగోలు సెంటర్లను తహసీల్దార్ సదానందం, ఆర్ఐ స్రవంతి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కృషి చేసిన ‘నమస్తే తెలంగాణ’కు రైతులు కృతజ్ఙతలు తెలిపారు. మార్కెటింగ్ సీసీ రాజన్న, ఏపీఎం త్రియంబకేశ్వర్, సీసీ రాజ్యలక్ష్మి తదితరులు ఉన్నారు.