భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పాలిత రాష్ర్టాల్లో గన్కల్చర్ కొనసాగుతున్నది, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సీఎం కేసీఆర్ అగ్రికల్చర్ను ప్రోత్సహిస్తూ.. రైతును రాజును చేశాడని ఆదిలాబాద్-నిర్మల్ జిల్లాల కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మసాల(బీ)లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. తొమ్మిదేండ్ల కాలంలో కేసీఆర్ చేసిన పనులు చెప్పడానికి వంద ఉన్నాయని.. అదే బీజేపీ ఏం చేసిందో చెప్పాగలదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొనుడు, ప్రభుత్వాలను పడగొట్టుడు తప్ప మరో మంచిపని చేసిందా అని మండిపడ్డారు. రాష్ర్టాల్లో తిరుగుబాటుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారని, హస్తిన పీఠం కదులుతుందన్న భయం బీజేపీకి పట్టుకున్నదన్నారు. కేసీఆర్ అంటేనే ఢిల్లీ బాస్లకు దడ అని పేర్కొన్నారు.
– బేల, ఏప్రిల్ 19
బేల, ఏప్రిల్ 19 : బీజేపీ పాలిత రాష్ర్టాల్లో గన్కల్చర్ కొనసాగుతున్నదని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అగ్రికల్చర్ను ప్రోత్సహిస్తున్నదని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మసాల(బీ) గ్రామంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా.. గంగాధర్ గౌడ్, రామన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా భవానీగూడలోని భవానీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎడ్లబండ్లపై గ్రామంలో తిరిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. తొమ్మిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ చేసిన పనులు చెప్పడానికి వంద ఉన్నాయని.. అదే బీజేపీ ఏం చేసిందో ఒక్కటైనా చెప్పాగలదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొనుడు, ప్రభుత్వాలను పడగొట్టుడు తప్పా మరో మంచిపని చేసిందా అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. బీజేపీ ఆధికారం కోసం పన్నాగాలు పన్నుతోందని విమర్శించారు. మన వద్ద రూ.2వేలు పెన్షన్ ఇస్తుంటే.. డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న గుజరాత్లో మాత్రం కేవలం రూ.600 ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి అన్ని రాష్ర్టాలకు తెలిసిందని, అందుకే యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తుండడం గర్వకారణంగా ఉందని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. బీజేపీ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల సంపద పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రైతు సంక్షేమ పథకాలతో భూముల విలువలు పెరిగాయన్నారు. తెలంగాణలో ఇస్తున్నట్లు సంక్షేమ పథకాలు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ర్టాల్లో తిరుగుబాటుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారని, హస్తిన పీఠం కదులుతుందన్న భయం బీజేపీకి పట్టుకున్నదని మండిపడ్డారు. కేసీఆర్ అంటేనే ఢిల్లీ బాస్లకు వణుకు అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, డీసీసీబీ చైర్మన్ ఆడ్డి భోజారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గంభీర్ ఠాక్రే, ప్రమోద్రెడ్డి, సతీశ్ పవర్, మెట్టు ప్రహ్లాద్, మంగేశ్ ఠాక్రే, బండి సుదర్శన్, వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, దేవన్న, మస్కే తేజ్రావు, బత్తుల సుదాం, వైద్యకిషన్రావు తదితరులు పాల్గొన్నారు.