మంచిర్యాల అర్బన్, మార్చి 11 : వెంటనే వేతనాలు చెల్లించాలని తెలంగాణ గ్రామ పం చాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం మంచిర్యాల పట్టణంలోని మం చిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఇళ్లముందు ఆందోళన నిర్వహించారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా గౌరవ అధ్యక్షుడు దుంపల రంజిత్కుమార్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
పారిశుధ్య కార్మికులకు వేతనాలు నెలలుగా నిలిచిపోవడంతో నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నయ్య, నాయకులు సాగర్, రాజలింగు, మల్లేశ్, సుజీత్, లక్ష్మి, రమేశ్, లింగన్న, ప్రశాంత్ పాల్గొన్నారు.