బేల, మే 17 : అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని డోప్టాల ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులకు రూ. 29 లక్షలు మంజూరు కాగా మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాలు విద్య,మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యాయన్నారు. విద్యా విధానంలో మార్పులకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నదని తెలిపారు. మన ఊరు- మన బడి కార్యక్రమంతో విద్యా విధానంలో కీలక మలుపు కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రతి స్కూల్లో గదుల మరమ్మతు, నీటి సౌకర్యం, విద్యుత్, మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాల కల్పనకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలోని అత్యంత నిరుపేద కుటుంబాలకు ఈ ఏడాది 60 డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు దళిత బంధు పథకం అమలు చేస్తామని చెప్పారు. సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ , డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, సర్పంచ్ రాకేశ్, నాయకులు గంభీర్ ఠాక్రే, ప్రమోద్ రెడ్డి, సతీశ్ పవర్,జక్కుల మధుకర్, మంగేశ్ ఠాక్రే, వట్టిపెల్లి ఇంద్రశేఖర్, కిషన్ వైద్య, రాకేశ్, విఠల్, వివేక్, ఎంపీడీవో రవీందర్, ఎంఈవో శ్రీనివాస్, పలువురు సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.
ఉద్యోగార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
ఎదులాపురం,మే17: ఉద్యోగార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే దిశగా అభ్యర్థులు శ్రమించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. చాందా(టీ) సమీపంలోని మైనార్టీ గురుకులం బాలుర పాఠశాలలలో మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత శిక్షణ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. అనంతరం అభ్యర్థులకు భోజన వసతిని ఎమ్మెల్యే ప్రారంభించారు. వారితో కలిసి భోజనం చేశారు. అభ్యర్థులు వివిధ పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. స్థానిక యువతకే ఉద్యోగాలు సాధించేలా ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. అభ్యర్థులు కష్టపడి శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించాలన్నారు. శిక్షణకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. జోగు ఫౌండేషన్ ద్వారా స్టడీ మెటిరియల్ను ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కృష్ణవేణి, ప్రిన్సిపాల్ చారి, కౌన్సిలర్లు అజయ్, బండారి సతీశ్,అశోక్ స్వామి, టీఆర్ఎస్ నాయకులు యూనుస్ అక్బానీ, పట్టణ కార్యదర్శి అశ్రఫ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ పాల్లొన్నారు.