ఆదిలాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ ): ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ ని యోజకవర్గం వెనుకబడిన ప్రాంతంగా ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నియోజకవర్గ ప్రజలకు వరంగా మారాయి. వివిధ రంగాలకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తూ ప నులు చేపడుతున్నది. వైద్య, విద్య, రవాణా, సాగునీరు, వ్యవసాయంతో పాటు ఇతర రంగా ల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. ప్రభు త్వం పథకాల కారణంగా ప్రజలకు మెరుగైన వై ద్యసేవలు అందుతుండడంతో ఆరోగ్యంగా ఉం టున్నారు. గతంలో ఏ గ్రామానికి వెళ్లాలన్న రోడ్డు సౌకర్యం ఉండేదికాదు, వాగులు, వంకలు పొంగి రాకపోకలు నిలిచేవి. రోడ్లు, వంతెనల నిర్మాణం తో ప్రజలకు రవాణా సమస్యలు లేకుండా పో యాయి. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ పథకాల ఫలితంగా రైతులకు సాగునీరు అందుతుంది. గతంలో ఒక్క పంట సాగుచేయాలంటే ఇబ్బందులు పడే అన్నదాతలు ఇప్పడు రెండు పంటలు సాగు చేస్తూ సంతోషంగా జీవిస్తున్నారు. పాఠశాల భవనాలు సరిగా లేక విద్యార్థుల చదువులు ముందుకు సాగేవి కావు. ప్రభుత్వం పక్కా భవనాలు నిర్మించడంతో పేద విద్యార్థులు బాగా చదువుకుంటున్నారు.
వైద్యసేవలకు పెద్దపీట
బోథ్ నియోజకవర్గంలో ఏజెన్సీ గ్రామాలు ప్ర జలకు వైద్యసౌకర్యాలు సరిగా అందకపోడవంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. సీజనల్ వ్యాధులతో మరణాలు సంభవించేవి. నియోజకవర్గంలో వై ద్యసేవలను మెరుగుపర్చడానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. బోథ్ మండలం కేం ద్రంలోని 30 పడకల కమ్యూనిటీ దవాఖాన భవనానికి ప్రభుత్వం రూ. 10.50 కోట్లను మంజూ రు చేయగా పనులు ప్రారంభమయ్యాయి. బోథ్ నియోజకవర్గంలో తొమ్మిది రూ. 144 లక్షలతో ఆరోగ్య ఉప కేంద్రాలు తలమడుగు, భీంపూర్, పొచ్చర, బొరిగామ, తలమద్రి, ఇచ్చోడ,. అం దూర్, చింతల్బోరి, కరత్వాడలో నిర్మిస్తున్నారు.
నియోజకవర్గంలో రూ. 90 లక్షలతో నేరడిగొండ, సొనాల, తాంసి, భీంపూర్, నర్సాపూర్, గుడిహత్నూర్, ఇచ్చోడ, ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాల్లో వైద్యం కోసం వచ్చే వారికి వసతులు క ల్పించారు. తలమడుగు మండలం కేంద్రంలోని అన్ని వసతులతో కూడిన దవాఖన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 1.50 కోట్లు మంజూరు చేసింది. రూ.1కోటితో తలమడుగు, పొచ్చర, బో రిగామ, కరత్వాడ, ఇచ్చోడల్లో నిర్మిస్తున్నారు. ఒ క్కో సెంటర్కు రూ.20 లక్షలు కేటాయించారు.
రహదారులు, వంతెనల నిర్మాణం
నియోజకవర్గంలోని రహదారులు, వంతెనలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం భారీగా రోడ్లు, వంతెన నిర్మాణం చేపట్టడంతో ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు దూరమయ్యయి. రూ. 6.52 కోట్లతో బోథ్ నుంచి నిర్మల్ జిల్లాలోని అడెల్లి వరకు కొత్తగా బీటీ రోడ్డు నిర్మాణం జరుగు తున్నది. వీటితో పాటు నియోజకవర్గంలో రూ. 42.29 కోట్లతో మారుమూల గిరిజన గ్రామాలకు కొత్తగా ప్రభుత్వం బీటీ రోడ్లను, రూ.6.40 కోట్ల తో బజార్హత్నూర్ మండంల కొల్హారి నుంచి మొర్కండి వరకు వంతెనలు, రూ. 18 కోట్లతో జమ్దాపూర్ నుంచి కరంజీ వరకు బీటీ రోడ్డు ని ర్మాణం జరుగుతుంది. రూ. 53.68 కోట్లతో ని యోజకవర్గంలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ రోడ్ల నిర్మాణాలు, రూ. 7.39 కోట్ల తో ఆర్అం డ్బీ శాఖ ఆధ్వర్యంలో వంతెనలు నిర్మించారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం
నియోజకవర్గంలో సాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఉండేది. వానకాల పంటలను మాత్రమే సాగు చేసేవారు. ప్రత్యేక రా ష్ట్రం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో సాగునీటి రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రాజెక్టుల నిర్మాణాలతో పాటు మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల మరమ్మతులు, చెక్డ్యాంల నిర్మాణాలు చేపట్టారు. రూ. 368కోట్లతో భీంపూర్ మండలం పిప్పల్కోటి వద్ద పెన్గంగ పై సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. 112 చెరువులకు మరమ్మతులు చేపడంతో 24 వేల ఆయకట్టు పెరిగింది. నియోజకవర్గంలో కొత్తగా 9 చెరువు లు, 23 చెక్డ్యాంలను నిర్మించారు.
పాఠశాలల భవనాలు
రూ. 24 కోట్లతో భీంపూర్, బోథ్, ఇచ్చోడ, సిరికొండ, తలమడుగులో కస్తూర్భా స్కూళ్లు, హా స్టల్ భవనాలను ఏర్పాటు చేశారు. రూ. 9 కోట్లతో మన్నూర్, కజ్జర్ల, నర్సాపూర్, నిపాని, దేగామ, బోథ్లలో విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆయా గ్రామాల రైతులు, ప్రజలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుంది. రూ. 13.50 కోట్లతో బోథ్, ఇచ్చోడ, తాంసి, తలమడుగు, గుడిహత్నూర్లో పంటలను నిల్వ చేసుకునేందుకు గోదాములు నిర్మించారు.
రెసిడెన్షియల్ స్కూళ్లు
పేద విద్యార్థుల చదువుల కోసం పెద్దపీట వేస్తు న్న ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ను అందిస్తుంది. ఇందులో భాగంగా భోథ్ నియోజకవర్గంలో 6 బీసీ, మైనార్టీ స్కూళ్లను ఏర్పాటు చేసింది. దీంతో పాటు నియోజకవర్గంలో గిరిజన విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాలను సైతం కొనసాగిస్తుంది. నియోజకవర్గంలోని బజార్హత్నూర్, గుడిహత్నూర్, బోథ్లలో ఆదర్శ పాఠశాలలు పేద విద్యార్థులకు వరంగా మారాయి. మన ఊరు, మ నబడి ఫథకంలో భాగంగా మొదటి విడుతలో 112 పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది.
దళితులకు వరంగా దళితబస్తీ
భూమిలేని వ్యవసాయ ఆధారిత దళిత కుటుంబాలకు దళితబస్తీ పథకం వరంగా మారింది. ని యోజకవర్గంలోని 9 మండలాల్లో 1019 మంది లబ్ధిదారులకు రూ.111.27 కోట్లతో 2557 ఎకరాల భూమిని ప్రభుత్వం పంపిణీ చేసింది. దీంతో గతంలో కూలీలుగా ఉన్నవారు రైతులుగా మారా రు. సర్కారు ఉచితంగా ఇచ్చిన భూముల్లో రెండు పంటలు సాగు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. దళితబంధు పథకంలో భాగంగా నియోజకవర్గంలో రూ.10 కోట్లతో 100 మంది లబ్ధిదారుల కు వివిధ యూనిట్లను పంపిణీ చేశారు.
బీఆర్ఎస్ వెంట నియోజకవర్గ ప్రజలు
బీఆర్ఎస్ ప్రభు త్వం అమలు చేస్తు న్న అభివృద్ధి, సంక్షే మ పథకాలు ప్రజలకు వరంగా మా రాయి. నియోజకవర్గంలో కొన్ని పెం డింగ్లో ఉ న్న పనులకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పూ ర్తి చేస్తాను. గ్రామాల్లో ప్రచారానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. మహిళలు, వృద్ధులు, యువకులు గ్రామాల్లో మంగళహారతులతో స్వా గతం పలుకుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను మూడోసారి అధికారంలోకి తీసుకువస్తామన్నారు.
– జాదవ్ అనిల్, బోథ్, అభ్యర్థి