Ganga water | కుభీర్, జూలై 21: గత 15 రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో పంటలు వేసుకున్న రైతులు ఎండు ముఖం పడుతుండడంతో రైతుల్లో గుబులు మొదలైంది. సోయా పత్తి మొలకలు ఎండల తీవ్రతకు తట్టుకోలేకపోతున్నాయి. దీంతో చేసేదేమీ లేక రైతులు ఆకాశం వైపు చూస్తూ దేవుని ప్రార్థిస్తున్నారు.
ఈ క్రమంలోనిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని సోనారి గ్రామస్తులు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బాసర గోదావరి నుండి గంగ నీళ్లను తెప్పించి భాజా భజంంత్రిలతో శోభయాత్రగా తరలివెళ్లి గ్రామంలోని గ్రామదేవతలతో పాటు గ్రామంలోని, ఆంజనేయస్వామి సాయిబాబా, దత్తాత్రేయ ఆలయాల్లో గ్రామ పొలిమేరల్లో గల పాప హరేశ్వర ఆలయంలో దేవతల విగ్రహాలకు జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి వర్షాలు కురవాలని వేడుకున్నారు. వీడీసీ అధ్యక్షుడు నాగభూషణం, గ్రామస్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.