నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 8 : నిర్మల్, ఖానా పూర్లో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్త య్యాయి. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న వినాయకులను శుక్రవారం నిమజ్జనం చేయనున్నారు. జిల్లాలో వినాయక శోభాయాత్ర కనుల పండువగా నిర్వహించేం దుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందు కు నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్, భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నిర్మల్ లోని వినాయక్ సాగర్ వద్ద మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఖానాపూర్లో ఏర్పాట్లను ఎమెల్యే రేఖానాయక్, పర్యవే క్షించారు.
పూర్తయిన ఏర్పాట్లు
నిర్మల్, ఖానాపూర్లో నిమజ్జనం సందర్భంగా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్రను నిర్వ హిస్తారు. శోభాయాత్ర జరిగే మార్గంలో విద్యుత్ లైన్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాట్లు, గుంతలను పూడ్చడం వంటి పనులు పూర్తి చేశా రు. క్రేన్లు, గజ ఈతగాళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. పురపాలక, విద్యుత్ శాఖ, ఆర్అండ్బీ, అగ్నిమాపక, వైద్యారోగ్య శాఖ అధికారులు ఏర్పా ట్లు చేశారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు.
రూట్ మ్యాప్ సిద్ధం
ఆయా వార్డుల్లో ప్రతిష్టించిన వినాయక విగ్ర హాలను నిమజ్జనం చేసేందుకు పోలీస్ అధికా రులు రూట్ మ్యాపు సిద్ధం చేశారు. బుధవా ర్పేట్, పాతబస్టాండ్, వివేకానంద చౌక్, రూరల్ పోలీస్ స్టేషన్, నగరేశ్వర వార్డు, నిషాన్, కస్బా, ద్యాగవాడ, మార్కెట్, టౌన్పోలీస్ స్టేషన్, గాంధీ చౌక్, సోమవార్పేట్, నాయుడివాడ, బంగల్పేట్ మీదుగా వినాయక్ సాగర్ వరకు శోభాయాత్ర సాగుతుంది.
భారీ బందోబస్తు
నిమజ్జన శోభాయాత్రను విజయవంతం చేసేందుకు పోలీసులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇందుకోసం జిల్లాకు ప్రత్యేక బలగాలను రప్పిం చారు. ఏఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 30 మంది ఎస్ఐలు, 450 మంది కానిస్టేబుళ్ల, సాయుధ దళ పోలీసులు విధులు నిర్వహించనున్నారు. అడుగడుగునా సీసీ కెమెరా లను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం నుంచి పరిస్థితిని పర్యవేక్షించేందుకు 3 డ్రోన్ కెమెరాలను వినియోగించనున్నారు. ప్రార్థన మందిరాలు, మసీదులు, దేవాలయాల్లో సీసీ కెమెరాలు, పోలీస్ పికెట్ను ఏర్పాటు చేశారు.
ప్రశాంతంగా నిర్వహిస్తాం..
జిల్లాలో వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుం టున్నాం. నిర్మల్, ఖానాపూర్పై ప్రత్యేక దృష్టి సారించాం. ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుపుకు నేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. అవాం ఛనీయ ఘటనలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసు కుంటాం. ప్రార్థన మందిరాలు, మసీదులు, దేవా లయాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశాం.
– ఎస్పీ ప్రవీణ్ కుమార్, నిర్మల్