దండేపల్లి, జనవరి 31: బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్య పడకుండా ముందుకు సాగాలని, వారికి తనతో పాటు పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. దండేపల్లి మండలంలోని గూడెం, నంబాల, వెల్గనూర్, కాసిపేట, కొండాపూర్, ద్వారక గ్రామాల్లో పర్యటించి కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, తాను ప్రజల మధ్యే ఉంటానని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతానని స్పష్టం చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజా క్షేత్రంలో ఉంటూ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని పిలుపునిచ్చారు. తన హయాంలో మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. కాసిపేటలో లిఫ్టును సందర్శించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ అనిల్, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, వైస్ చైర్మన్ అక్కల రవి, సర్పంచ్ శాంతయ్య, బీఆర్ఎస్ నాయకులు బండారి మల్లేశ్, గోళ్ల రాజమల్లు, మంద రాజయ్య, శంకర్రావు, కస్తూరి వెంకటేశ్, ముచ్చర్ల తిరుపతి, తదితరులున్నారు.