హాజీపూర్, మే 5 : సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా దొంగ ప్రమాణాలు చేస్తున్నారని, ప్రజలెవ్వరూ కాంగ్రెస్ను నమ్మే స్థితిలో లేరని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు.
ఆదివారం హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్ మండల అధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్, సాగి వెంకటేశ్వర్ రావు, చింతపండు రాయలింగు, మొగిలి సత్యం, శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.