హాజీపూర్, ఏప్రిల్ 14 : బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. ఆదివారం మండలంలోని ర్యాలీ గఢ్పూర్ గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెఎస్ పార్టీకి ఓటు వేస్తే ఏమి జరిగిందో అందరికీ తెలుసని, మళ్లీ అలాంటి పొరపాటు చేయవద్దని ప్రజలకు సూచించారు.
పల్లెలను అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు భారీ మెజార్టీ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట మండల అ ధ్యక్షులు మొగిళి శ్రీనివాస్, గోపతి లక్ష్మయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.