చెన్నూర్, మార్చి 21 : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి సత్తాచాటాలని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. గురువారం చెన్నూర్ పట్టణంలోని సంతోషీమాత ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూర్, కోటపల్లి, భీమారం మండలాల బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిచారు. ప్రచారంలో భాగంగా వచ్చిన కొప్పుల ఈశ్వ ర్, బాల్క సుమన్ను నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.
మొదట బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అంకితభావంతో పనిచేస్తే గెలుపు మనదేనన్నారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని నంబర్వన్గా నిలిపారని కొనియాడారు. 60 ఏండ్లు పాలించిన పాలకులు ఉచిత కరెంటు, సాగు నీరు ఎందుకు ఇవ్వలేదని, అదే కేసీఆర్తో ఎందు కు సాధ్యమైందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విష ప్రచారం చేస్తున్నారని, గోదావరి నీళ్లను రైతులకు అం దించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. రైతుబంధు అడిగినందుకు సీఎం, మంత్రులు చెప్పులతో కొడుతామని ఆహకారంతో మా ట్లాడుతున్నారని, వారికి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
చెన్నూర్ లో రూ.1600 కోట్ల అభివృద్ధి పనులు రద్దు చేశారని, మూడు మున్సిపాలిటీల్లో రూ. 100 కోట్ల అభివృద్ధి పనులను నిలిపి వేశారని మండిపడ్డారు. ఎన్నికల ముందు వలస వచ్చి న వివేక్ వెంటస్వామి, వినోద్, వంశీల కు టుంబం దేశంలోనే అత్యధిక ధనికుల్లో 9వ స్థానంలో ఉంటుందన్నారు. కుంటుంబ పాల న గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని , వివేక్ వెంటస్వామి, వినోద్ ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేలుగా ఉండి, వివేక్ కుమారుడు వంశీని ఎంపీగా పోటీ చేయిస్తామంటున్నాడని, ఇది కుటుంబ పాలన కాదా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ ఒక్క ఓటమితో ఎవరూ బాధ పడవద్దని, మొండి ధైర్యంతో ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనను, మూడు నెలల కాంగ్రెస్ పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారన్నారు. 420 హామీలతో పాటు ఆరు గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చెన్నూర్, కోటపల్లి ఎంపీపీలు మంత్రి బాపు, మంత్రి సురేఖ, చెన్నూర్ జడ్పీటీసీ మోతె తిరుపతి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లెల దామోదర్రెడ్డి, కోటపల్లి వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్రావు, కోటపల్లి సింగల్ విండో చైర్మన్ పెద్దపోలు సాంబాగౌడ్ పాల్గొన్నారు.
మందమర్రి, మార్చి 21 : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. మందమర్రి పట్టణంలోని సింగరేణి సీఈఆర్ క్లబ్లో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ బాల్క సుమన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరించి తమకు అనుకూలంగా మలుచుకోవాలని కోరారు.
చెన్నూర్ మాజీ ఎమ్మె ల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ ఓటమి గెలుపునకు నాంది అని, ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన నాయకులు, కార్యకర్తలు నిరాశ పడకుండా పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. తన హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తిస్తారని, చెన్నూర్ను వెళ్లే ప్రసక్తే లేదని, రాను న్న ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి గెలుస్తానని ధీ మా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు వేల్పుల రవి, వైస్ ఎంపీపీ రాజ్కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డా క్టర్ రమేశ్రాజా, పట్టణ అధ్యక్షుడు జే.రవీందర్, పట్టణ ఇన్చార్జి బత్తుల శ్రీనివాస్, మండ ల అధ్యక్షుడు సంజీవరావు, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు సంపత్ పాల్గొన్నారు.
జైపూర్, మార్చి 21: తెలంగాణ సాధించి, రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టికే అండగా నిలవాలని పెద్దపెల్లి పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నా రు. గురువారం జైపూర్ మండలకేంద్రంలో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మోసపూరిత హమీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ను అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అరవిందరావు, సీనియర్ నాయకులు మధూకర్రెడ్డి, సురేందర్రెడి, ఆర్నె సమ్మయ్య, గుండు తిరుపతి, మేడి తిరుపతి పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్, మార్చి 21: బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని నాయకులకు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు. గురువారం రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్బజార్ సెంటర్లోని పార్టీ కార్యాలయంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనుసరించాల్సిన విధానాలను నాయకులకు వివరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కంభగోని సుదర్శన్గౌడ్, ఇన్చార్జి గాండ్ల సమ్మయ్య, సీనియర్ నాయకుడు డా. రాజారమేశ్బాబు,గోపు రాజం పాల్గొన్నారు.