సోన్, అక్టోబర్ 30 : ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఇంటికీ సంక్షేమ పథకం అందుతు న్నదని, అందని ఇల్లు లేదని బీఆర్ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణగౌడ్ పేర్కొ న్నారు. సోమవారం సోన్ మండలం గంజాల్, సాకెర, గాంధీనగర్, న్యూవెల్మల్ గ్రామాల్లో బూత్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విధాల వసతులు కల్పించిదని, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని దీన్ని ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని కోరారు. ప్రస్తుతం 24 గంటల కరెంటు భారతదేశంలో ఎక్కడ లేదన్నారు.
కొత్త మ్యానిఫెస్టో ప్రకారం సామాన్యులకు రూ.400 సిలెండర్, పింఛన్లు పెంపు తదితర వాటిని పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి విజయం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు. సోన్ మండల ఎన్నికల ఇన్చార్జిలు రాజేందర్రెడ్డి, మహేశ్రెడ్డి, సోన్ బీఆర్ఎస్ మండల కన్వీనర్ మోహినొదీన్, జడ్పీటీసీ జీవన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, రైతు బంధు సమితి కోఆర్డినేటర్ మహేందర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, గ్రామస్తులు మల్లయ్య, భాస్కర్, మహేందర్, దశరథ్, ముత్తన్నలు పాల్గొన్నారు.
నిర్మల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలోని నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్రెడ్డి సోమవారం ఇంటిం టికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిని గెలి పించుకునేందుకు కృషి చేయాలని కోరారు. సాద విజయ్, కర్రొల్ల లింగన్న, సదు గంగన్న, ఆకుల రమేశ్, నవీన్రెడ్డి, అంబకంటి రమేశ్, చిల్ల భోజ న్న, నరేశ్, నర్సయ్య, యువ నాయకులు కొప్పుల కృష్ణ, నితిన్, అజయ్, గోపు సాయి, ప్రణీత్, రాజు, తదితరులున్నారు.
మామడ, అక్టోబర్ 30 : మండలంలోని పొన్కల్, దిమ్మదుర్తి, మామడ, అనంతపేట్, చందారం గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధి కార ప్రతినిధి అమరవేణి నర్సాగౌడ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గౌడ కులస్తులను కలిసి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి గెలిపించేందుకు గౌడ కులస్తులు మద్దతు తెలు పాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అల్లోల ఇంద్ర కరణ్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించా లన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అన్ముల భాస్కర్,బీఆర్ఎస్ మండల కన్వీనర్ పాకాల చంద్రశేఖర్గౌడ్, మామడ సర్పంచ్ హన్మా గౌడ్, రమణగౌడ్, శ్రీనివాస్గౌడ్, నర్సారెడ్డి, మల్లేశ్ గౌడ్, మేకం అశోక్ తదితరులు ఉన్నారు.
నర్సాపూర్(జీ), అక్టోబర్ 30 : మంత్రి, బీఆర్ ఎస్ అభ్యర్థి అల్లోల కార్యకర్తలు గెలుపునకు కృషి చేయాలని నర్సాపూర్(జీ), దిలావర్పూర్ బీఆర్ ఎస్ మండల బాధ్యులు (ఇన్చార్జి) సొలిపురం రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు రాంపూర్లో పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బైక్ ర్యాలీలో పాల్గొన్నా రు. అనంతరం కార్యకర్తలతో జరిగిన సమావేశం లో మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ విజయం కోసం పని చేయాలని సూచించారు.
10 సంవత్స రాల్లో ఎంతో అభివృద్ధి జరిగిందని, మరింత అభి వృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్న రామయ్య, సర్పంచ్ రాంరెడ్డి, ఎంపీటీసీ మల్లేశ్, కొండ్ర రమేశ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ గోపిడి గంగారెడ్డి, కోఆప్షన్ మెంబర్ ఫసి, బర్కుంట గంగారాం, బర్కుంట రాము, గ్రామ అధ్యక్షుడు శంకర్, మహేందర్, జాబీర్, ఆయిటి మహేశ్, అజయ్, వీ సాగర్, మైనార్టీ యూత్ ప్రెసిడెంట్ మజార్, జుబేర్, అమరేందర్, రాథోడ్ శ్రీను, రైస్ఖాన్, రాంపూర్ యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్, నాయకులు నవీన్, నారాయణ, జీవన్రావ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
నర్సాపూర్(జీ), అక్టోబర్ 30 : మండలంలోని అంజనీతండాలో సోమవారం బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తండాలను అభివృద్ధి చేసిన ఘనత కేవలం సీఎం కేసీఆర్కు దక్కుతుందని నాయకుడు జాదవ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. అంబర్ సింగ్, కైలాస్ జాదవ్, మంగల్, శంకర్ నాయక్, రాథోడ్ గంగారాం, తానాజీ పాల్గొన్నారు. బూర్గు పల్లిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరాలంటే కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరా రు. సర్పంచ్ విఠాబాయి శ్రావణ్, మండల కన్వీ నర్ పాపెన్ రాజేశ్వర్, కుంటాల మండల కన్వీనర్ దత్తు, కుంటాల జడ్పీటీసీ గంగామణి బుచ్చన్న, ఆత్మ చైర్మన్ అశోక్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సట్ల గజ్జారాం, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కుమ్మరి భాస్కర్ కార్యకర్తలు పాల్గొన్నారు.