ముథోల్, మార్చి 10 : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని తరోడా గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన రూ. 20 లక్షలతో సీసీ రోడ్డు పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, సర్పంచ్ శ్వేతా రవికిరణ్ గౌడ్, మాజీ సర్పంచ్ ఆరీఫ్, నాయకులు కిషన్, మరీబా కార్యకర్తలు, వార్డు సభ్యులు ఉన్నారు.
ఆలయంలో పూజలు
తానూర్, మార్చి 10 : మొగిలి గ్రామంలో విఠలేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు ఎమ్మెల్యే విఠల్రెడ్డిని సన్మానించారు. సర్పంచ్ పుండ్లిక్, ఎంపీటీసీ సిరి మొల్లా లక్ష్మణ్, ఆత్మ చైర్మన్ కానుగంటి పోతా రెడ్డి, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, తాడేవార్ విఠల్, రాములు, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.