భైంసా, నవంబర్ 7 : పత్తి సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పేర్కొ న్నారు. వ్యవసాయ మార్కెట్ గాంధీ గంజ్లో సోమవారం పత్తి బహిరంగ వేలం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజన్ ప్రారంభంలో పత్తి అధికంగా మార్కెట్కు వస్తుం దని అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులు దళారులను నమ్మి నష్టపోవద్దన్నారు. ప్రతి రైతు ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరకు తాము ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. అనంత రం బహిరంగ వేలం నిర్వహించగా వ్యాపారులు క్వింటాలు పత్తిని రూ. 8,600లకు విక్రయించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పీ కృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆసిఫ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బామ్ని రాజన్న, మురళి గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, ప్రధాన కార్యదర్శి తోట రాము, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్, సంతోష్, నరేందర్, ప్రసన్నజిత్ ఆగ్రే, వ్యాపారులు ఓం లడ్డా, కుంట రాజలింగు, తదితరులు ఉన్నారు.
మునుగోడు విజయం బీఆర్ఎస్కి తొలి మెట్టు
కుభీర్, నవంబర్ 7 : మునుగోడులో అధికార (టీఆర్ఎస్) బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి జాతీయ పార్టీగా బోణీ కొట్టిందని ముథోల్ ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు గడ్డిగారి విఠల్రెడ్డి పేర్కొన్నారు. కుభీర్లో మునుగోడు విజ యం సందర్భంగా మండల నాయకులు, కార్యక ర్తలు నిర్వహించిన సంబురాల్లో ఆయన పాల్గొ న్నారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచారు. ఎమ్మెల్యేకు స్వీట్లు తినిపించి అభినందనలు తెలి పారు. అనంతరం ఆయన ప్రెస్ మీట్లో మాట్లా డుతూ బీజేపీ వాపును చూసి బలుపుగా భావిస్తు న్నదని మండి పడ్డారు. మూడోసారి సీఎంగా కేసీఆర్ హ్యట్రిక్ సాధించడం ఖాయమని పేర్కొ న్నారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా ప్రధాన కార్య దర్శి తూం రాజేశ్వర్, ఏఎంసీ చైర్మన్ కందూరి సంతోష్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, మండల పార్టీ అధ్యక్షుడు ఎన్నీల అనిల్ ఉన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
కుభీర్తోపాటు మాలేగాంవ్, గోడాపూర్, హల్ద, మౌలా తదితర గ్రామాలకు చెందిన 8 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కుభీర్లో అందజేశారు. ఆయా గ్రామాల్లో పలు వురి కుటుంబాలను ఆయన పరామర్శించా రు. సర్పంచ్ మహిపాల్రెడ్డి, పీఏసీఎస్ చైరన్ గంగా చరణ్, ఏఎంసీ చైర్మన్ కందూరి సంతోష్, వైస్ చైర్మన్ మెంచు రమేశ్, దత్తహరి పటేల్, డైరెక్టర్ సంతంరెడ్డి, తూము రాజేశ్వర్, ఏఎంసీ వైస్ చైర్మెన్ దిగంబర్ పటేల్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.