పెంబి, అక్టోబర్ 26 : రైతుబంధు పథకం నిలిపివేయాలని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ మండ ల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ నాయకులు, రైతులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్య క్షుడు సల్లా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు పథకాలు నిలి పివేయాలని కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయ డం దారుణమని పేర్కొన్నారు.
రైతులపై వారికి ఏపాటి ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి భూక్యా జాన్సన్ నాయక్ను భారీ మెజార్టీతో గెలిపించాని కోరారు. వైస్ ఎంపీపీ గంగారెడ్డి, సర్పంచ్లు పూర్ణచందర్ గౌడ్, సుధాకర్, తానా జీ, ఎంపీటీసీ రామారావు, బీఆర్ఎస్ నాయకులు భూక్యా గోవింద్, బడగు మల్లేశ్, గాండ్ల శంకర్, ఇస్మాయిల్, రియాజ్, పుప్పాల రాజేందర్, నరేందర్, మహేందర్, రైతులు పాల్గొన్నారు.
ఖానాపూర్ టౌన్, అక్టోబర్ 26 : రైతు వ్యతిరేక విధానలను అవలంభిస్తున్న కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాళ్లపల్లి రాజ గంగన్న పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే అభ్య ర్థి భూక్యా జాన్సన్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ లోని రైతులకు రైతుబంధు, దళితులకు దళిత బంధు ఇవ్వవద్దని సీఈసీకి కాంగ్రెస్ నేతలు లేఖ రాయడం తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ నాయకు లకు ఉన్న చిత్తశుద్ధి బయటపడింద న్నారు. కాంగ్రె స్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నా రు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, నాయకులు, ప్రజాప్రతినిధులు అకుల వెంకగౌడ్, మోహిద్, శనిగారపు శ్రావణ్, ఖలీల్, పరిమి సురేశ్, వాల్సింగ్, జన్నారపు శంకర్, కావలి సంతోష్, పుప్పాల గజేందర్, రాజరెడ్డి, అమంద శ్రీను, కొడిమ్యాల వీరేశ్, తుప్ప నరేం దర్, తూం చరణ్, సుద్దాల మహిపాల్, బక్కశెట్టి అశోక్, రామిడి మహేశ్, తదితరులున్నారు.
కడెం, అక్టోబర్ 26 :రైతులపై కపట ప్రేమను చూపిస్తూ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాజేశ్వర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్ గుప్తా పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రం లోని హరిత రిసార్ట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. రైతులపై కాంగ్రెస్ పార్టీ తన అక్క సును బయటపెడుతూ రైతు బంధును అపా లం టూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయ డం హేయమైన చర్య అని మండిపడ్డారు. కరోనా కన్నా డేంజర్గా కాంగ్రెస్ రాజకీయాలు న్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ కోఅప్షన్ సభ్యుడు రఫీక్, నాయకులు, ప్రజాప్రతినిధులు శ్యాంసుందర్, కొండాపురం అనూష లక్ష్మణ్, మల్లేశ్, సుద్దాల లక్ష్మీ జగన్, నల్లగొండ, పంజాల రాముగౌడ్, భీమేశ్, కల్లెం తిరుపతి రెడ్డి, రవి, గౌసొద్దీన్, కలీం, కే శేఖర్, మనోహర్, నాగరాజు, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
దస్తురాబాద్, అక్టోబర్ 26 : కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేఖ పార్టీ అని మరోసారి రుజువైందని ఎంపీపీ సింగరి కిషన్, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అర్గుల రాజనర్సయ్య పేర్కొ న్నారు. రైతు బంధు, దళిత బంధు పథకాలు ఆపాలని కాంగ్రెస్ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ మండ ల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాల యం వద్ద గురువారం విలేకరుల సమావేశం నిర్వహిం చి మాట్లాడారు. రైతు బంధు పథకంపై కాంగ్రెస్ నాయకులు విషం చిమ్ముతున్నారని ఆరోపించా రు.
ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ను అధిక మెజార్టీతో గెలిపించు కుందామని పేర్కొన్నారు. జడ్పీటీసీ సంతపూరి శారదా శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్పర్సన్ రామ డుగు శైలజా రమేశ్రావు, సర్పంచ్లు నిమ్మతోట రాజమణి శివయ్య, మారాజు పోశవ్వ సత్తన్న, ఉప సర్పంచ్ ఒడిసె మాణిక్రావు, నాయకులు ఎండపెల్లి గంగన్న, తేలు తిరుపతి, పార్వతి లచ్చ న్న, దాసరి సుధాకర్, బొమ్మెన గోపి, అల్తాటి రాజేందర్, నన్న రాజు, రవీందర్, నర్సయ్య, నరేశ్, శ్రీనివాస్, గోపి, కార్యకర్తలు పాల్గొన్నారు.