అదిలాబాద్ : కాంగ్రెస్ నినాదం మూడు గంటలు, బీజేపీ నినాదం మతం మంటలు, బీఆర్ఎస్ నినాదం మూడు పంటలు అని బోథ్ శాసన సభ్యుడు రాథోడ్ బాపురావు అన్నారు. గురువారం భీంపూర్ మండలంలోని నిపాని గ్రామ రైతు వేదికలో రైతులతో సమావేశమై మాట్లాడారు. దేశంలో 24 గంటల ఉచిత అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఆన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేక పంటలు ఎండిపోయి ఆత్మహత్యలకు పాల్పడేవారన్నారు.
కేసీఆర్ అధికారాంలోకి వచ్చిన తర్వాత సాగుకు సరిపడా నీళ్లు, ఎరువులు, నిరంతర విద్యుత్ అందిస్తూ రైతును రాజు చేశాడన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభివృద్ధిపై రైతులు చర్చ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ అధికార ప్రతినిధి మొట్టే కిరణ్ కుమార్, మండల కన్వీనర్ నాగయ్య, ఎంపీపీ సంతోష్, సర్పంచ్ ప్రమీల – రాజన్న, సర్పంచుల సంఘం అధ్యక్షులు లింబాజి, అనిల్, గోవర్ధన్, బోథ్ ఏఎంసీ చైర్మన్ రుక్మన్ సింగ్, మండల కన్వీనర్లు రాజారాం, వెంకటేష్, అరుణ్ పాల్గొన్నారు.