ఎదులాపురం : అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం మున్సిపల్ పరిధి టీఎన్జీవో భవనంలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ టీకా సెంటర్, బృందావన్కాలనీలో ఇంటింటికి వెళ్లి వేస్తున్న టీకా తీరును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఇంటింటికి వెళ్లి 18 ఏండ్లు నిండిన వారి సమాచారం , కొవిడ్ టీకా తీసుకున్న , తీసుకోని వారి వివరాలు సేకరించాలని సూచించారు. ఇప్పటి వరకు టీకా తీసుకోని వారికి మొదటి డోస్ ఇప్పించాలని, మొదటి డోస్ తీసుకున్న వారికి రెండవ డోస్ తీసుకోనెలా ప్రోత్సహించాలని వెల్లడించారు.
ఆశ, అంగన్వాడీ, మెప్మా సిబ్బంది ప్రతి ఇంటిలోని వారి సమాచారం సేకరించాలని అన్నారు. వార్డుల్లో ఆటోల ద్వారా ప్రచారం చేస్తూ వ్యాక్సిన్ అందించాలన్నారు. మున్సిపల్ రిసోర్స్పర్సన్లను వినియోగించుకోవాలన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలను వెంటనే యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, అదనపు జిల్లా వైద్య అధికారి డాక్టర్ సాధన, మున్సిపల్ కమిషనర్ శైలజ, మున్సిపల్ ఈఈ వెంకటశేషయ్య, సానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ , వైద్య, మున్సిపల్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.