ఎస్హెచ్జీ సభ్యులకు ఎమ్మెల్యే విఠల్రెడ్డి సూచన
లోకేశ్వరం, జూన్ 30: స్వయం సహాయక సం ఘాల సభ్యులకు బ్యాంకులు అందిస్తున్న రుణాల ను సద్వినియోగం చేసుకోవాని ఎమ్మెల్యే విఠల్ రె డ్డి సూచించారు. లోకేశ్వరం మండల కేంద్రంలోని రైతువేదికలో గురువారం మండల నాయకులతో కలిసి మండల సమాఖ్య సంఘాలకు స్త్రీ నిధి చె క్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్క డా లేని విధంగా మహిళలకు అతి తక్కువ వడ్డీకి రుణాలను అందించి, వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కారేనని చెప్పారు.
నిర్మల్ జిల్లానే ఎక్కువ రుణాలు పొంది మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. డీఆర్డీవో విజయలక్ష్మి మాట్లాడుతూ తీసుకున్న రుణాలపై ఆదాయం పొంది, తిరిగి చెల్లించడం ద్వారా మరింత లబ్ధి పొందాలని సూచించారు. అనంతరం సుమారు రూ. 8 కోట్ల విలువైన చెక్కులను మహిళా సంఘాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్యాం సుందర్, ఎంపీపీ లలితా భోజన్న, ఉపాధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డి, తహసీల్దార్ సరిత, ఎంపీడీవో దేవేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, టీఆర్ఎస్ మండల క న్వీనర్ కరిపేశ్యాంసుందర్, ఆయా గ్రా మాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ డైరెక్టర్లు నాయకులు నాలం గం గాధర్, బండి ప్రశాంత్, చిరుమణి ది గంబర్, సుదర్శన్ రెడ్డి, గన్ను నర్సారెడ్డి, ఏపీఎం మల్లేశ్, స్త్రీనిధి ఆర్ఎం రాందాస్, గ్రామీణ బ్యాం కు మేనేజర్ అశోక్, ఐకేపీ సీసీలు, సిబ్బంది ఆ యా గ్రామాల సభ్యులు పాల్గొన్నారు.