ఆసిఫాబాద్ టౌన్, ఫిబ్రవరి 18: తెలంగాణ గిరిజన గురుకులాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీవోఈ గురుకులాల్లో 2024-25 ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష జిల్లా కేం ద్రంలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలో మూ డు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
గిరిజన బాలుర పాఠశాలలో 447 మందికి 440 మంది, బాలికల గురుకులంలో 216కు 206, గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో 188 కు 181 మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా 851 మందికి 827 మం ది పరీక్ష రాసినట్లు చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ గిరిజన గురుకులాల సమన్వయాధికారి గంగాధర్ పర్యవేక్షించారు. సీఎస్లు సురేశ్, అనిత తదితరులున్నారు.