కెరమెరి, ఏప్రిల్ 13 : తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన లేండిగూడ గ్రామస్తులు తాగు నీటి కోసం పడుతున్న ఇబ్బందులపై ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రికలో ‘గుట్ట దిగితేనే గొంతు తడిచేది’ పేరిట కథనం ప్రచురితమైం ది. ఈ విషయమై కలెక్టర్ వెంకటేశ్ దోత్రే స్పం దించారు.
లేండిగూడలో తాగు నీటి సమస్య కు పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఎంపీవో మహ్మద్ అమ్జద్, గ్రామపంచాయతీ ప్రత్యేకాధికారి, మిషన్ భగీరథ ఏఈ సంతోష్ కుమార్ హుటాహుటిన లేండిగూడకు చేరుకొని మిషన్ భగీరథ నీరు ఇం టింటికీ సరఫరా అయ్యేలా చూశారు.
విద్యు త్ అంతరాయంతో పాటు పైపులైన్లో ఏర్పడ్డ ఇబ్బందుల వల్ల నీటి ఎద్దడి ఏర్పడిందని, మరమ్మతులు చేసి తాగు నీటి సమస్య పరిష్కారించామని, ఇకపై ప్రతి రోజూ తాగు నీరు సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మల్లే శ్, జీపీ సిబ్బంది ఉన్నారు. కాగా, తాగు నీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ‘నమస్తే’కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.