రెబ్బెన: రక్తదానం మహదానం అని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ వైవీఎస్ సుధీంధ్ర అన్నారు. రెబ్బెన మండల కేంద్రంలోని కేకే గార్డెన్లో సోమవారం పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రెబ్బెన పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ మాట్లాడుతూ.. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలన్నారు. అన్ని దానాల్లో రక్తదానం చాలా గొప్పదని, అది మరొకరి ప్రాణం నిలబెడుతుందని అన్నారు.
అనంతరం రక్తదానం చేసిన 160 మందికి సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్, ఎస్ఐ భవానిసేన్, పీఎస్ఐ సోనియా, ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోశ్, పీఏసీఎస్ చైర్మన్ కార్నాథం సంజీవ్కుమార్, వైస్ చైర్మన్ రంగు మహేశ్గౌడ్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు చెన్న సోమశేఖర్, ఎంపీటీసీలు పెసరి మధునయ్య, సంఘం శ్రీనివాస్, కోఆప్షన్మెంబర్ జౌరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.