జైపూర్, డిసెంబర్ 21 : పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు అన్నారు. గురువారం వేలాల గ్రామ పంచాయతీని అధికారులతో కలిసి సందర్శించారు. పారిశుధ్య పనులను పరిశీలించారు. ప్రతి రోజూ రహదారులు, మురుగు కాలువలను శుభ్రం చేయాలని, రోడ్లపై ప్లాస్టిక్ లేకుండా చర్యలు తీసుకోవాలని, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ఇంటింటికీ చెత్త సేకరించాలని సూచించారు. నర్సరీలో బ్యాగు ఫిల్లింగ్ పనులు పూర్తి చేయాలని చెప్పారు.
సెగ్రిగేషన్ షెడ్ను సందర్శించి కంపోస్ట్ ఎరువు తయారీ విధానాన్ని పరిశీలించారు. కంపోస్ట్ ఎరువు తయారీ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని, నర్సరీ, పల్లె ప్రకృతి వనంలోని మొకలకు వినియోగించాలని సూచించారు. శ్మశాన వాటిక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.. మొకలను సంరక్షించాలని కార్యదర్శికి సూచించారు. అనంతరం రికార్డులు తనిఖీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్యాగ శ్యామల, ఉప సర్పంచ్ నగేశ్, పంచాయతీ అధికారి అనిల్, కార్యదర్శి రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.