బోథ్, జూలై 11 : పోడు భూముల పట్టాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గిరిజనుల కలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్కు దుక్కుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సాంగ్వి గ్రామంలో మంగళవారం గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి పీఆర్ డిపార్ట్మెంట్ ద్వారా మంజూరైన రూ.20 లక్షలతో భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ నారాయణ రెడ్డి, సర్పంచ్లు పాల్గొన్నారు.
పల్లెలకు రవాణా సౌకర్యం మెరుగు పరుస్తున్నాం
మారుమూల పల్లెలకు రవాణా సౌకర్యం మెరుగు పరుస్తున్నామని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని ధన్నూర్(బీ) నుంచి నాగాపూర్ గ్రామం వరకు ట్రైబల్ సబ్ ప్లాన్ (ఐటీడీఏ) నిధులు రూ.2.10 కోట్లతో చేపడుతున్న 3.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని రోడ్లు లేని గ్రామాలను గుర్తించి నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే మారుమూల పల్లెలకు బీటీ రోడ్డు సౌకర్యం కలుగుతున్నదన్నారు. గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ను ప్రజలు మర్చిపోవద్దన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ నారాయణరెడ్డి, నాగాపూర్ సర్పంచ్ కోవ సుమిత్ర, ఏఎంసీ చైర్మన్ రుక్మాణ్సింగ్, బలిరాం, రామారావ్, మాన్కు, ఐటీడీఏ ఏఈఈ సుధాకర్, జేఈ శంకర్రావ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.