ఆదిలాబాద్ టౌన్, పిబ్రవరి25: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో రాష్ట్రంలో లక్షల కుటుంబాల్లో వెలుగులు నిండాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. ఎమ్మెల్యే శుక్రవారం ఆదిలాబాద్ మండలంలోని చింతగూడ, అంకాపూర్, లోకారి, వాన్వట్, మామిడిగూడ, కండాల ,లింగుగూడ, ధార్లొద్ది, పిప్పల్ధరిలో ఇంటింటికీ తిరుగుతూ 35 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లెప్రగతి, రైతుబంధు, బీమా, ఉచిత విద్యుత్, దళితబంధు, పింఛన్లు, దళితబస్తీ లాంటివి ప్రపంచంలోనే అరుదైన పథకాలన్నారు. కార్యక్రమంలో మెట్టు ప్రహ్లాద్, ఎంపీపీ సెవ్వ లక్ష్మీజగదీశ్ యాదవ్వైస్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, టీఆర్ఎస్ కన్వీనర్ సోనేరావు, సర్పంచులు, ఎంపీటీసీలు జంగుబాపు , జంగుపటేల్, నాయకులు నరేశ్ ఆరె, రమణ, భూమన్న, రామన్న, గంగయ్య, మాధవ్రావు, కేమ నందు తదితరులున్నారు.