HomeAdilabadDharani Portal Has Become The Basis Of Lakhs Of Farmers 2
ధరణితో ధీమా
ధరణి పోర్టల్.. లక్షలాది మంది రైతులకు ఆధారమైంది. ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపింది. కుటుంబాల్లో ఇబ్బందులను తొలగించింది. రిజిస్ట్రేషన్ కోసం దళారులను ఆశ్రయించడం.. కార్యాలయాల వద్ద పడిగాపులు లేకుండా చేసింది.
అవినీతికి అడ్డుకట్ట.. భూ మోసాలకు స్వస్తి
అధికారుల చేతివాటానికి చెల్లుచీటి
కాంగ్రెస్ హయాంలో బ్రోకర్లదే దందా
అప్పటి తిప్పలు మళ్లీ రావొద్దు
ఈ పోర్టల్నే కొనసాగించాలి
రైతుల డిమాండ్.. విపక్షాల వ్యాఖ్యలపై ఆగ్రహం
ధరణి పోర్టల్.. ఎందరో రైతులకు ఆధారమైంది. దశాబ్దాలుగా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా పరిష్కారం కాని సమస్యలకు ఓ మార్గం చూపింది. గ్రామాల్లో ఏళ్ల తరబడి నడిచిన పంచాయితీలను తెంచింది. భూమి విషయంలో కుటుంబాల్లో నెలకొన్న ఇబ్బందులను తొలగించింది. దళారుల ఆగడాలు లేకుండా చేసి, మోసాలకు స్వస్తి పలికింది. కార్యాలయాల్లో అవినీతిని పారదోలింది. అయితే ఇప్పుడు ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాట్లాడడంపై రైతాంగం మండిపడుతున్నది. అలా చేస్తే మళ్లీ పాత రోజులే వస్తాయని, అందుకే ఆ పార్టీలకు అవకాశం ఇవ్వొద్దని చెబుతున్నది.
– తాంసి, జూన్ 23
తాంసి, జూన్ 23 : ధరణి పోర్టల్.. లక్షలాది మంది రైతులకు ఆధారమైంది. ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపింది. కుటుంబాల్లో ఇబ్బందులను తొలగించింది. రిజిస్ట్రేషన్ కోసం దళారులను ఆశ్రయించడం.. కార్యాలయాల వద్ద పడిగాపులు లేకుండా చేసింది. మ్యుటేషన్ కోసం అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరగడం.. లంచాలు ముట్టజెప్పడం వంటి వాటికి స్వస్తి పలికింది. అంతేకాదు, రైతుబంధు, రైతుబీమా పథకాలు నేరుగా రైతుకు అందడంలో కీలకమైంది. మోసాలకు స్వస్తి చెప్పింది. ఇన్ని సమస్యలకు పరిష్కారం చూపిన ధరణిని కాంగ్రెస్, బీజేపీ నాయకులు రద్దు చేస్తామని మాట్లాడడంపై రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. అలా చేస్తే మళ్లీ దళారులే రాజ్యమేలుతారని, రైతులు అరిగోస పడుతారని చెబుతున్నది. అలాంటి పరిస్థితి రావొద్దని, ఆ పార్టీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేస్తున్నది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు ధరణి పోర్టల్తో రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. సమైక్య పాలనలో చెప్పులరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిన ప్రజలకు పరిష్కారం చూపింది. దరఖాస్తు చేసుకున్న కొన్ని రోజుల్లోనే ఇంటికి వచ్చి మరి పాసు బుక్లను అందిస్తుండడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. రూపాయి ఖర్చు లేకుండా తమ భూమి హక్కు పత్రాలు అందడంతో ధరణి పోర్టల్ ఎప్పుడూ ఉండాలని రైతులు కోరుతున్నారు.
పాత పద్ధతిలో అడుగడుగునా అవస్థలే
గతంలో భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగీ వేసారేది. రెవెన్యూ కార్యాలయానికి వెళ్తే అధికారులు పట్టించుకోకపోవడమే కాకుండా, కనీసం లోపలికి అడుగు పెట్టనిచ్చే వారు కాదు. పట్వారీ ఉంటే గిర్దావర్ ఉండడు. వీరిద్దరూ ఉంటే తహసీల్దార్ ఉండడు. ఇలాంటి పరిస్థితిలో రైతులు దళారులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఎంతో కొంత ముట్టచెబితే కానీ హక్కు పత్రాలు అందకపోయేవి. పైగా సొంత భూమి ఎవరి పేరు మీదకు మారుతుందో తెలియని పరిస్థితి ఉండేది. పల్లెల్లో గెట్టు పంచాయతీలు పెరిగి ఇరువర్గాల మధ్య గొడవలకు దారితీసేది. సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు నానుస్తూ తమ పబ్బం గడుపుకునేవారు. తాతలు, తండ్రులు కాలం చేస్తే వారి పేరిట ఉన్న భూమి కొడుకుల పేరిట మార్చుకోవాలన్నా ముప్పు తిప్పులు పడేది. దీనిని ఆసరాగా చేసుకొని అధికారులు చేతివాటం ప్రదర్శించేవారు. ఫలితంగా రెవెన్యూ వ్యవస్థలో అవినీతి పెరిగిపోయింది. ఇలా ఏండ్లకేండ్లుగా భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. గతంలో ఓ మండల పరిధిలోని భూములు మరో మండల పరిధిలో ఉండి రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలన్నా పేరు మార్పిడి చేయించుకోవాలన్నా ఆ మండలానికి వెళ్లడానికి రైతులు చాలా ఇబ్బంది పడేవారు. వ్యవసాయ పనులు వదులుకొని రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది.అయితే ధరణి వచ్చాక ఈ సమస్యలు పోయాయి. మంచి రోజులు వచ్చాయి.
కాంగ్రెస్ నేతలకు బుద్ధి లేదు..
ఒకప్పుడు తాతలు, తండ్రుల పేరు మీద ఉన్న భూములు వారసుల పేరు మీదకు మార్చుకోవా లంటే తాంసికి పోవాల్సి ఉండే. 9 కిలో మీటర్ల దూరం లో ఉన్న అక్కడి కార్యాలయానికి వెళ్తే తర్వాత సార్లు లేరని వెళ్లగొట్టేది. ఇట్ల నెలలకొద్ది తిరిగిన రోజులు న్నయ్. ఇలా తిరిగితే పని కాదని, ఆఫీసుల ముందుండే దళారులను పట్టుకుంటే పనైపోతుందని అటెండర్లు చెబుతుండే. వాళ్లకు కొంత ముట్టజెప్పితే కాని మా తాత పేరు మీదున్న భూమి మా నాయిన పేరుమీద కాలే. తెలంగాణ సర్కారు వచ్చినంక ధరణి తెచ్చింది. మొన్ననే మా గట్టు పక్కనున్న రైతు పొలం కొన్నా. సాక్షి సంతకం పెట్టమని రమ్మంటే మా తహసీల్ ఆఫీసుకు వెళ్లిన. అన్ని కాగితా లు చూసి సంతకాలు తీసుకున్నరు. పావుగంటల పాసుబుక్కు ఇచ్చిన్రు. నాటి రోజు యాదిజేసుకుని బాధపడ్డ. పైసలు ఖర్చయినయి. రోజుల తరబడి తిరిగి నం. కేసీఆర్ సార్ తెచ్చిన ధరణి పుణ్యమా అని బాధలు తీరినయ్. దీన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్. బీజేపీ పార్టీలోళ్లు లొల్లి లొల్లి చేస్తున్న రు. అసలు ఆ పార్టీలోళ్లకు బుద్ధి లేదు. వాళ్లని నమ్మితే కథ మొదటికస్తది. ధరణిని రద్దు చేస్తే మళ్లీ దళారుల దందా మొదలైతది.
– తోన్పె తిరుపతి, రైతు, పొన్నారి
పైసా ఖర్చు లేకుండా పట్టా
నాకు తొమ్మిదిన్నర ఎకరాల భూమి ఉంది. రెండెక రాలకొక పాసుబుక్కు ఉండేది. ఒక్కటే పాసుబుక్కుపై ఏడు ఎకరాలు ఎక్కించమని ఎనిమిదేండ్ల కింద ఆఫీసుకు పోయిన. పట్వారీ ఉంటే గిర్దావర్ ఉండదు. ఆ ఇద్దరుంటే తహసీల్దార్ ఉండదు. ఇట్ల నాలుగేండ్లు ఆఫీసు చుట్టూ తిరిగిన, బండి ఖర్చులు, ఎవుసం పని దండుగైంది తప్ప పనికాలే. కేసీఆర్ సార్ సల్లంగుండ.. ధరణి తెచ్చిండు. దరఖాస్తు చేసుకున్నంక జాగ నాదా కాదా అని పరిశీలించిన్రు. తెల్లారి రమ్మన్నరు. సంతకాలు పెట్టిన వెంటనే బుక్కు చేతికిచ్చిన్రు. నాడు నాలుగేండ్లు తిరిగితే నేడు ఒక్క రోజులనే పనైంది. ధరణి వల్లే మా గోస తీరింది. పట్వారీ, గిర్దవార్ల పనే లేదు. ఒక్క తహసీల్దార్ ఉంటే మొత్తం పనైపోయింది. ఇది ఇట్లనే నడిపించాలి. పైసా ఖర్చు అయితలేదు.
– సిరిగిరి విఠల్, రైతు, పొన్నారి తాంసి
కాంగ్రెసోల్లవి మాయ మాటలు..
రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతూ రైతులకు అండగా నిలుస్తున్నది. దీంట్లో భాగంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఇంత మంచి పథకాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తీసేస్తాం అనడం విడ్డూరంగా ఉంది. గతంలో మండల కేంద్రానికి వెళ్లి ఎన్నో బాధలు, ఖర్చులకు ఓర్చుకొని భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకొని వచ్చేవాళ్లం. ఇక్కడ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇచ్చి నెలలు, ఏండ్లు గడుస్తున్నా మన పేరు మీద భూమి బదలాయింపు కాకపోయేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మండలకేంద్రంలో ధరణితో చకచకా రిజిస్ట్రేషన్, పక్షం రోజులకు రికార్డుల్లోకి ఎక్కించి పట్టా పాసు పుస్తకం చేతికి ఇస్తున్నరు.
– తారుడి శ్రీనివాస్, యువరైతు, తాంసి.
ముసలోళ్లకు ఇబ్బంది లేకుండా వోయింది…
భూముల రిజిస్ట్రేషన్ కోసం మంచి సౌలత్ జేసిండ్రు. మాకు తెలిసినప్పటి సంది భూమి కోసం పట్వారీ, గిర్దవార్ల సుట్టూ తిరిగేటోళ్లం. ఇప్పుడు అసుంటి తక్లీపులు లేకుండా వోయినయ్. అన్ని కంప్యూటర్లనే అయినయ్. ఏదైనా పనిపడితే మీ సేవలకు పోయి అక్కడ ఆైప్లె చేసుకుంటే తహసీల్ ఆఫీస్ల కూడా జల్ది పనులు చేస్తుండ్రు గిట్లనే ఉండాలే. గింత మంచిగ చేస్తున్న కేసీఆర్కు ఎంతో పుణ్యం అస్తది. గీ సౌలత్లను చూస్తే మస్తు సంతోషమనిపిస్తు న్నది. కేసీఆర్ సార్ చాలా మంచి పనులు చేస్తుండు. రైతులకు ఏ రంది లేకుండా చూస్తుండు.
– ఏనుగు నరోత్తం రెడ్డి, రైతు, జామిడి
ధరణిలో ఎక్కితే చాలు మార్చలేరు..
ధరణి పోర్టల్లో రైతులకు చాలా మేలు కలుగుతుంది. ఒక్కసారి ధరణి వెబ్సైట్లోకి పేరు ఎక్కితే చాలు దానిని మార్చడం ఎవరితరం కూడా కాదు. అందుకే ప్రభుత్వం ఇలాంటి పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది. గిరిజన, గిరిజనేతరులకు కూడా షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తించేలా చర్యలు తీసుకున్నది. పెండింగ్లో ఉన్న పుస్తకాలు పోస్టల్ ద్వారా ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుంటే చాలు టైమ్కు ఆఫీసు వస్తే క్షణాల్లో పని పూర్తవుతుంది. ఆన్లైన్ కాపీ వెంటనే ఇస్తున్నాం. వారంలో పట్టా పాస్బుక్ పోస్టు ద్వారా ఇంటికే పంపిస్తున్నాం.
– శ్రీదేవి, తహసీల్దార్, తాంసి.
మండలంలోనే అన్ని పనులు పూర్తి
ధరణి పోర్టల్తో సేవలన్నీ చేరువయ్యాయి. ముఖ్యంగా మహిళలకు ఎంతో సౌకర్యంగా మారింది. భూముల ముచ్చట అంటేనే మగవారు చూసుకో వాల్సిన వ్యవహారం అన్న చందంగా ఉండేది. కానీ ధరణితో ఆ బాధ లేదు. ధరణి యాప్ ద్వారా భూముల రికార్డులను ఇంట్లో ఉండే చూసుకోగలు తున్నాం. ఒకప్పుడు పహానీ నకల్ కావాలంటే తహసీల్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుండే. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. భూములు అమ్మినా, కొన్నా ఇంతకు ముందు జిల్లాకు పోయి అక్కడ రోజుల తరబడి వేచి ఉండి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుండే. కానీ ఇప్పుడు మా మండలం లోనే అన్ని పనులు అయిపోతున్నాయి. నా పేరు మీద రెండెకరాల భూమి రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇంటికి పట్టా పాస్బుక్కు కూడా వచ్చింది. మహిళా రైతులకైతే ధరణి పోర్టల్తో చాలా ఇబ్బందులు దూరమయ్యాయి.