గుడిహత్నూర్, మార్చి 3 : టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా గుడిహత్నూర్లో గురువారం సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోథ్ దవాఖాన, గుడిహత్నూర్ పీహెచ్సీలో సౌకర్యాల మెరుగు కోసం, కావాల్సిన సిబ్బంది నియామకాలు చేపట్టాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన అంశాన్ని వైద్య ఆరోగ్య శాఖ వారితో నిర్వహించే సమీక్షా సమావేశంలో చర్చిస్తామన్నారు. నియోజక వర్గంలో 20 ఆరోగ్య ఉపకేంద్రాలకు భవనాలు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్టు లెక్చరర్లు మంత్రికి వినితిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, ఎమ్మెల్సీ విఠల్, మాజీ ఎంపీ వేణుగోపాలాచారి, సర్పంచ్ జాదవ్ సునీత, ఎంపీటీసీలు న్యాను, శగీర్ఖాన్, టీఆర్ఎస్ జిల్లా, మండల నాయకులు జాదవ్ రమేశ్, సోంబాయి, శీల, జ్యోతి, కరాడ్ బ్రహ్మానంద్, లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీ కుమ్మరి సత్యరాజ్, ఎండీ గఫార్, జమీర్, సుధాకర్రెడ్డి, జలంధర్, రాజేశ్వర్, మాధవ్, సలీంఖాన్, రావణ్ ముండే, ఆశన్న యాదవ్, వినోద్ పాల్గొన్నారు.