ఇంద్రవెల్లి, జనవరి 30 : హస్తలమడుగులో సేకరించిన గంగాజలంతో మెస్రం వంశీయులు దోడందకు చేరుకున్నారు. ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్ పొలిమేరలో మంగళవారం కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని దోడందకు బయలు దేరారు. గ్రామస్తులతోపాటు మెస్రం వంశీయులు ఝరికి ప్రత్యేక పూజలు చేశారు.
గ్రామ పొలిమేరలోని ఓ చెట్టుపై అల్లుడితో గంగాజలం ఝరిని భద్రపర్చారు. మెస్రం వంశీయులు గంగాజలంతో ఈనెల 30 నుంచి 4వ తేదీ వరకు దోడందలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కటోడ మెస్రం కోసు, పర్ధాంజీ మెస్రం దాదారావ్, కటోడ కోసేరావ్, నాయిక్వాడి మెస్రం ధర్ము, పెన్కొత్వాల్ మెస్రం తిరుపతి తెలిపారు.