బోథ్, డిసెంబర్ 20 : ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఐఈవో రవీందర్ సూచించారు. తలమడుగులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అధ్యాపకులు, విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కళాశాలలో రికార్డుల నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కళాశా లలో విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉండడంతో అధ్యాపకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు కళాశాలకు ప్రతి రోజూ వచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకో వాల న్నారు.
ఈ సందర్భంగా డీఐఈవో రవీందర్ మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ వరకు సిలబస్ను పూర్తి చేసి పరీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు. జనవరి, ఫిబ్రవరిలో ఎంసెట్ కోసం ప్రత్యేక తరగతులు నిర్వహి స్తున్నామని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యా ర్థులకు ఏప్రిల్, మేలో జిల్లా స్థాయిలో ఎంసెట్ శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సి పాల్ మాధవ్ రావు, అధ్యాపకులు ఉన్నారు.
తాంసి కళాశాలలో..
భీంపూర్, డిసెంబర్ 20 : తాంసిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను డీఐఈవో రవీందర్ తనిఖీ చేశారు. పరీక్షలకు విద్యా ర్థులను సన్నద్ధం చేయాలని అధ్యాపకులకు సూచించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, అధ్యాపకులు ఉన్నారు.