ఆసిఫాబాద్, ఫిబ్రవరి23 : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా విద్యాధికారి అశోక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్మేరీ పాఠశాలలో చదువుతున్న మసాదే శివకృష్ణ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. మహబూబ్నగర్ జిల్లాలో ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననుండగా, డీఈవో శుక్రవారం శివకృష్ణను అభినందించారు.
ఆయన మాట్లాడుతూ క్రికెట్లో రాష్ట్రస్థాయికి ఎదగడం గొప్ప విషయమని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని శివకృష్ణకు సూచించారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ కార్యదర్శి సాంబశివరావు,క్రీడల అధికారి మీనారెడ్డి, ప్రిన్సిపాల్ మేరికేవి, పీజీ హెచ్ఎం పూర్ణచంద్, శ్రీనివాస్, పీఈటీలు కడతల రాకేశ్, కిరణ్, అర్చన, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.