ఎదులాపురం, జనవరి 5 : వానకాలం 2023లో రైతులకు పంట రుణపరిమితిని పెంచి ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే వాన కాలం పంట కాలానికి రైతులకు బ్యాంకులు ఇచ్చే రుణపరిమితిని పెంచడానికి కమిటీ నిర్ణయించిం దని, ఆ ప్రతిపాదనలు రాష్ట్ర స్థాయి అధికారులకు పంపిస్తామని తెలిపారు. పత్తి, సోయాబీన్, కంది, వరి పంటలకు 20 శాతం చొప్పున, ఇతర పంటలకు 15 శాతం చొప్పున, పండ్లు, కూరగా యలు, మిర్చి, పసుపు పంటలకు 15 శాతం, తేనే, లక్క సాగుకు 10శాతం చొప్పు న పెంచాల ని సంబంధింత శాఖల అధికారులు, బ్యాంకర్లు, నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.
ప్రతిపాదిం చిన ఆర్థిక పరిమితికి సంబంధించిన జస్టిఫికేషన్ల తో ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు రుణ పరిమితిపై సలహాలు, సూచనలను అందించారు. అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పీ శ్రీజ, డీఆర్డీవో కిషన్, ఏడీసీసీ బ్యాంకు సీఈవో కే శ్రీధర్ రెడ్డి, నాబార్డ్ డీడీఎం అబ్దుల్ రవూఫ్ప్, అదనపు డీఆర్డీవో రవీందర్ రాథోడ్, ఉమ్మడి జిల్లా వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశు సంవ ర్ధక శాఖల అధికారులు, లీడ్ బ్యాంక్ మేనేజర్లు వివిధ బ్యాంకు అధికారులు ఉన్నారు.