కుభీర్, సెప్టెంబర్ 29 : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని ఓ ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులో గురువారం పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మద్దతు ధర రూ.6,060 ఉండగా.. వ్యాపారులు రూ.10,016 పెట్టి కొనుగోలు చేశారు. ఇది మద్దతు ధర కంటే రూ.3,956 అదనం.
గతేడాది ప్రారంభ ధర రూ.5,500 పలుకగా.. ఫిబ్రవరి నాటికి రూ.10 వేలకు చేరింది. కాగా.. ఈ సీజన్లో ఆరంభంలోనే రూ.10 వేలు పలుకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.