ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, జనవరి 21 : బైక్పై బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా.. కంటైనర్ ఢీకొట్టడంతో తల్లీ కొడుకులు మృతి చెందిన ఘటన ఆదివారం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ చెక్పోస్టు వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో కుటుంబ పెద్ద తీవ్రగాయాలతో బయటపడగా, తన కళ్లెదుటే భార్య, కుమారుడు మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. కాగజ్నగర్ మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ సర్వర్ తన భార్య జహీరా (35), కుమారుడు ఆసిఫ్(16)తో కలసి బైక్పై ఆదివారం ఉదయం 7 గంటలకు ఆసిఫాబాద్లోని బంధువుల ఇంటికి వచ్చాడు.
ఉదయం 11 గంటల ప్రాంతంలో తిరిగి వెళ్తున్న క్రమంలో ఆసిఫాబాద్లోని అటవీశాఖ చెక్పోస్టు వద్ద ప్రధాన రహదారి దాటుతుండగా, మంచిర్యాల వైపు నుంచి చంద్రాపూర్కు వెళ్తున్న కంటైనర్ ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లింది. దీంతో జహీరా, ఆసిఫ్ అక్కడికక్కడే మృతి చెందగా, సర్వర్కు తీవ్రగాయాలయ్యాయి. అదే కంటైనర్ మంచిర్యాల వైపు వెళ్తున్న మరో లారీని సైతం ఢీ కొట్టింది. సదరు లారీ డ్రైవర్కు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.