ఆసిఫాబాద్ టౌన్,ఫిబ్రవరి 4: చిరు వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి ప్రోత్సహించడం ద్వారా ఆర్థికంగా చేయూతనిద్దామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు.
జిల్లా కేంద్రంలోని కోట్నాక భీమ్ రావు పిల్లల ఉద్యానవనంలో ప్రతి ఆదివారం పారును సందర్శించే వారికి అల్పాహారం, తినుబండారాల విక్రయ కేంద్రాన్ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ,ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఖుష్బూ గుప్తా, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి ప్రారంభించారు. ఆసిఫాబాద్ తహసీల్దార్ రమేశ్, మున్సిపల్ సిబ్బంది, చిరు వ్యాపారులు పాల్గొన్నారు.