ఆసిఫాబాద్, జనవరి 8 : ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల ఏఎన్ఎంలు ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో పొరుగు సేవల పద్ధతిన తమను విధుల్లోకి తీసుకోవాలని దరఖాస్తు అంద జేశారు. కాగజ్నగర్ పట్టణంలోని కీజర్నగర్కు చెందిన రజి యా బేగం తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని అర్జీ అందించారు.
కాగజ్నగర్ పట్టణానికి చెందిన కొట్రంగి స్వ రూప తన ఎడమచేతి 4 వేళ్లు ముడుచుకొని ఉంటాయని, సదరం సర్టిఫికెట్లో సున్న శాతంగా వచ్చిందని, మరొకసారి అవకాశం కల్పించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. కాగజ్నగర్ పట్టణంలోని పెట్రోల్ పంపు ఏరియాకు చెందిన దివ్యాంగుడు భేటీ విజయ్కుమార్, వాంకిడి మండలం ఖరిడి గ్రామానికి చెందిన జాడి సునీత ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తులు అందజేశారు.
పెంచికల్పేట మండలం కమ్మర్గాం గ్రామానికి చెందిన చెన్నూరి చిన్నక సదరం సర్టిఫికెట్ అందించి.. దివ్యాంగ పింఛన్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జైనూర్ మండలం జంగావు కిషన్ నాయక్ తండాకు చెందిన రాథోడ్ శంకర్ తన భార్య దూరిబాయి పేరిట ఉన్న భూమిని ఆమె మరణించిన తర్వాత తనకు తెలియకుండా తన కుమారులు పట్టా చేసుకున్నారని, ఈ విషయమై విచారించి తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
వాంకిడి మండలం గోయగాం గ్రామానికి చెందిన దుర్వాసగుప్త బసు తమ ఊరిలో అంగన్వాడీ పోస్టు ఖాళీగా ఉందని, తనకు అవకాశం కల్పించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. వాంకిడి మండలం నవగూడ గ్రామానికి చెందిన శంకర్ తనకు సదరం సర్టిఫికెట్ ఇపిపచాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో పరిషరించేందుకు కృషి చేస్తామన్నారు.