నస్పూర్, మార్చి 30 : లోక్సభ ఎన్నికల నిర్వహణ, ప్రవర్తనా నియమావళిపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు రాహుల్, మోతీలాల్, ఆర్డీవో రాములు, ప్రత్యేక ఉప పాలనాధికారి చంద్రకళతో కలిసి ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ రోజు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల విషయంలో ఇబ్బంది తలెత్తినట్లయితే వెంటనే చర్యలు తీసుకోవాలని, ఫారం 12డీ, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు.