నస్పూర్, జనవరి 17: రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరగుతుందని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నస్పూర్లోని కలెక్టరేట్లో జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్యతో కలిసి 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల బ్యానర్లు, వాల్ పోస్టర్లు, స్టిక్కర్లను బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వర కు జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవా లు నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయా ణం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
స్పష్టమైన ఫొటో ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా నూతన ఓటరు నమో దు, ఓటరు జాబితా సవరణ, మార్పు లు, తొలగింపుల కోసం జిల్లాలో ఈ నెల 20, 21 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమో దు, సవరణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏండ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు, సవరణ, తొలగింపుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన 6,7,8 పారాలు బూత్ స్థాయి అధికారుల వద్ద అందుబాటులో ఉంటాయని తెలిపారు.
పాలనలో ఉత్తమప్రతిభ చూపిన ప్రభు త్వ ఉద్యోగుల(సివిల్ సర్వెంట్స్)కు అందించేందుకు ప్రధానమంత్రి పురస్కారాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. న్యూఢిల్లీ నుంచి కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం సంయుక్త కా ర్యదర్శి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో నస్పూర్లోని కలెక్టరేట్ కార్యాల యం నుంచి బుధవారం ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్యాటగిరి 1లో 12 ప్రాధాన్యతల కింద ఉత్తమప్రతిభ చూపిన వారికి 10 అవార్డులు, క్యాటగిరి 2 కేంద్ర, రాష్ట్ర జి ల్లాల వారీగా ఆవిష్కరణల విభాగంలో ఉత్తమ సేవలందించిన వారికి 6 అవార్డు లు అందిస్తారని తెలిపారు. ఏప్రిల్ 1, 2021 నుంచి జనవరి 31, 2024 మధ్యకాలంలో చేసిన సేవలకు ఈ పురస్కారాలు అందిస్తారని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, 5 దశలలో పరిశీలన జరుగుతుందని తెలిపా రు. తుది దశలో పురస్కార గ్రహీతలను ప్రధానమంత్రి ఆమోదిస్తారని, ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.