ఆదిలాబాద్ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బంగారు తాపడం నిర్మాణం కోసం భక్తులు తమ వంతు చేయూతనందించేందుకు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా కే సర్పంచ్ మీనాక్షి గాడ్గే ఆధ్వర్యంలో గ్రామస్తుల నిధుల సేకరణ చేపట్టారు. ఇంటింటికి తిరిగి రూ. 51 వేల నిధులు సేకరించారు. మరిన్ని నిధులు సేకరించి యాదాద్రి ఆలయానికి అందజేస్తామని గ్రామస్తులు తెలిపారు.