పెంబి, జూలై 17 : రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం ఇటిక్యాల గ్రామంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన రైతుల సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల ఉచిత కరెంట్పై కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతున్నదని మండిపడ్డారు. గత పాలకుల నిర్లక్ష్యంతో రాత్రి సమయంలో పంటలకు నీరందించే క్రమంలో విషపురుగుల బారినపడి అనేక మంది రైతులు మరణించిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. మూడు పంటలకు నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో..? మూడు గంటలే విద్యుత్ అంటున్న కాంగ్రెస్ కావాలో..? ప్రతి రైతు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తొమ్మిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టంకట్టాలని సూచించారు.
పేదలకు అండగా సీఎంఆర్ఎఫ్
పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. ఇటిక్యాలలో మండలంలోని 17 మంది లబ్ధిదారులకు రూ. 5,19,000 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుప్పాల శంకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నరేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ గంగారెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ భూక్యా టీకాజీ, సర్పంచ్లు మహేందర్, సుదర్శన్, సుధాకర్, రాజు, ఎంపీటీసీ రామరావు, బీఆర్ఎస్ నాయకులు విలాస్, రాజేందర్, దేవేందర్, శేఖర్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
రైతు వ్యతిరేక కాంగ్రెస్ను తరిమికొడుదాం
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతు రాజ్యం నడుస్తోందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లోని రైతు వేదికలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ 75 ఏండ్ల పాలనలో రైతుల గురించి ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. కానీ స్వరాష్ట్రంలో విద్యుత్ రంగం గణనీయమైన ప్రగతిని సాధించిందని, అందుకు సీఎం కేసీఆర్ పరిపాలన దక్షతే నిదర్శనమని పేర్కొన్నారు. సాగుకు నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా అందించడమే కాకుండా రాష్ట్రంలో ఎవరు అడగకపోయినా పంట సాగుకు పెట్టుబడి సాయం, రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా రైతు బీమా వంటి పథకాలు అందిస్తున్నారని చెప్పారు. ఇవి దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు ఉచిత విద్యుత్పై లేనిపోని ఆరోపణలు చేస్తూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దు , మూడు గంటలు చాలు అన్న కాంగ్రెస్ నాయకులను తరిమి కొడుతామన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. అనంతరం రైతు వేదిక వద్ద హరితహరంలో భాగంగా గ్రామస్తులకు ఎమ్మెల్యే మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మోహిద్, ఏఎంసీ మాజీ చైర్మన్ పుప్పాల శంకర్, వైస్ఎంపీపీ వాల్సింగ్, ఏఎంసీ వైస్ చైర్మన్ గొర్రె గంగాధర్, పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, సర్పంచ్ హరిత, నాయకులు చరణ్, ప్రతాప్రావు, పుప్పాల గజేందర్, పత్రి నగేశ్, కరిపె శ్రీనివాస్, దాసరిగొండ మల్లయ్య, అంజన్న, కామోజీ శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.