ఎదులాపురం, జూలై 6 : సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్ కులవృత్తిదారులకు ఆర్థిక చేయూత అందించేందుకు చర్యలు చేపట్టారు. బీసీల్లో వెనుకబడిన కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించే పథకానికి శ్రీకారంచుట్టారు. గత నెల 20వ వరకు జిల్లా వ్యాప్తంగా కుల వృత్తిదారులు 11,721 మంది దరఖాస్తు చేసుకు న్నారు. సర్కారు ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ వార్డులు, గ్రామాల్లో ప్రత్యేక అధికారులు సర్వే పూర్తి చేశారు. త్వరలో అర్హుల జాబితాను ప్రకటించనున్నారు. ప్రభుత్వం నిర్ణయంతో తమ జీవితాల్లో వెలుగులు నిండను న్నాయని లబ్ధిదారులు అనందం వ్యక్తం చేశారు.
అత్యంత వెనుకబడిన తరగతులకు రూ.లక్ష అం దించే కార్యక్రమాన్ని దశాబ్ది వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఇందుకోసం జిల్లాలో వివిధ వృత్తి కులాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో అర్హులను గుర్తించి ప్రతి నెల 15న విడుతల వారీగా లబ్ధిదారులకు రూ.లక్ష సాయం అందిం చేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆర్జీలు పెట్టుకున్న వారు అదే వృత్తిలో కొనసాగుతున్నారా? లేదా? అత్యంత నిరు పేదలా? సొంతిల్లా? అద్దె ఇంట్లో ఉంటున్నారా? వంటి వివరాలను గ్రామాల్లో పంచాయతీ కార్యద ర్శులు, మున్సిపల్ అధికారులు దరఖాస్తుదారుల ఇంటింటికీ వెళ్లి సర్వే చేశారు. పూర్తి సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందజేశారు. ప్రతి దరఖాస్తుదారుడు కులవృత్తి ఆర్థిక సాయం వస్తే ఏ యూనిట్ తీసుకుంటాడో సర్వే ఫాంపై నమోదు చేశారు. సర్వేఫారంలను ఎంపీడీవో కార్యాల యం, మున్సిపల్ కార్యాలయం ద్వారా సర్వే సమాచారాన్ని అన్లైన్ చేస్తున్నారు.
త్వరలో లబ్ధిదారుల గుర్తింపు
అర్హులు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి త్వరలో లబ్ధిదారుల గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం అదేశించింది. మండల స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపల్ స్థాయిలో కమిషనర్ ఆధ్వర్యంలో దరఖాస్తులను పరిశీలిస్తారు. ఎంపికలో ప్రధా నంగా అత్యంత పేదరికంలో మగ్గుతున్న వారిని గుర్తిచంనున్నారు. వితంతువులు, ఒంటరి మహిళ లు, దివ్యాంగులు, సంచార జాతుల(యాచన వృత్తిదారులు)లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. లబ్ధిదారులు తప్పకుండా దరఖాస్తులో సూచిం చిన చిరునామాలో నివాసం ఉండాలి. మండల ,మున్సిపల్ స్థాయిలో ఎంపికైన జాబితాను జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారికి అందిస్తారు. అక్కడ పరిశీలించిన అనంతరం దానిని కలెక్టర్ ఆమో దానికి పంపుతారు. మరో సారి కలెక్టర్ పరిశీలించి ఆమోదించాక లబ్ధిదారుల అర్హుతలను బట్టి విడుతల వారీగా ఆర్థిక సాయం అందిస్తారు. ఎంపికైన లబ్ధ్దిదారులకు జిల్లా ఇన్చార్జి మంత్రి ఆధ్వర్యంలో అందిస్తారు. ఎంపికైన వారి వివరాల జాబితాను మండలాలు, గ్రామాల్లో ప్రదర్శిస్తారు. ఎంపికైన వారికి ఒకేసారి రూ.లక్ష సాయాన్ని అందిస్తారు.
మండలాలవారీగా దరఖాస్తులు..
జిల్లా వ్యాప్తంగా 18 మండలాల నుంచి 11,721 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆదిలాబాద్ రూరల్ 1220, ఆదిలాబాద్ పట్టణం 3101, బజార్హత్నూర్ 246, బేల 727, భీంపూర్ 444, బోథ్ 644, గాదీగూడ 74, గుడిహత్నూర్ 372, ఇచ్చోడ 493, ఇంద్రవెల్లి 347, జైనథ్ 1238, మావల 516, నాన్నూర్ 56, నేరడిగొండ 350, సిరికొండ 186, తలమడుగు 812, తాంసి 477,ఉట్నూర్ 418 మంది దరఖాస్తు చేసుకున్నారు.
దళారులను నమ్మవద్దు..
రూ.లక్ష సాయం అర్హులైన లబ్ధ్దిదారులకు ప్రతి నెలా 15 తేదీన విడుతల వారీగా అందిస్తారు. ఎట్టి పరిస్థితిల్లో దళారుల మయమాటలు నమ్మ వద్దు. ఎంపిక అనేది పూర్తి స్థాయిలో పారద ర్శకంగా జరుగుతుంది. వచ్చిన దరఖాస్తులపై సర్వే సైతం పూర్త యింది. వందశాతం అత్యంత పేద కులవృత్తుల్లో ఉన్న వారికి సాయం అందుతుంది. పంపిణీకి ఇంకా ప్రభుత్వా నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. జిల్లా ఇన్చార్జి మంత్రి ఐకే రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తాం.
– కే రాజలింగు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆదిలాబాద్