రాష్ట్ర రాజధానుల్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్స్ను జిల్లాల్లో కూడా నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారని, ఆ మేరకు ప్రస్తుతం నిర్మల్ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి వైజ్ఞానిక పోటీలు.. ఉట్నూర్లో ఉమ్మడి జిల్లా సైన్స్ ఫెయిర్స్ ప్రారంభించామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని కుమ్రం భీం ప్రాంగణంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీడీఏ ద్వారా అన్ని ఆశ్రమాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించామన్నారు. విద్యతోపాటు సైన్స్లో రాణించేలా ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. – ఉట్నూర్, జనవరి 10
ప్రమాదాలను నివారించే
స్మార్ట్ బైక్నిర్మల్ అర్బన్, జనవరి 10 : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఈ స్మార్ట్ బైక్ ఉపయోగపడుతుంది. రిమోట్ కంట్రోల్ ఆధారంగా ఇది పని చేస్తుంది. హైల్మెట్ లేకుంటే బైక్ స్టార్ట్ కాదు. ఓవర్ స్పీడ్గా వెళ్తే సంబంధిత మొబైల్కు ఎస్ఎంఎస్ వస్తుంది. నిద్రపోయి వాహనం నడిపితే అలర్ట్ చేస్తుంది.
– గంట హర్షిక,
లిటిల్ ప్లవర్ పాఠశాల, ఆదిలాబాద్
ఉట్నూర్, జనవరి 10 : రాష్ట్ర రాజధానుల్లో నిర్వహించే సైన్స్ ఫెయిర్స్ను ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో నిర్వహిస్తున్నామని అటవీ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కేంద్రంగా స్థానిక కుమ్రం భీం ప్రాంగణంలో నిర్వహించిన ఐటీడీఏ ఉమ్మడి జిల్లా సైన్స్ ఫెయిర్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు సైన్స్ ఫెయిర్స్ హైదరాబాద్, పెద్ద పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యే వన్నారు. కానీ.. ఇటీవల 33 జిల్లాలతో కూడిన సైన్స్ ఫెయిర్ను నిర్మల్ కేంద్రంగా.. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సైన్స్ ఫెయిర్ను ఉట్నూర్ కేంద్రంగా నిర్వహిస్తున్నామన్నారు. ఐటీడీఏ ద్వారా అన్ని ఆశ్రమాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించామన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలు ఉన్నత చదువుల కోసం 1000 గురుకులాలు ప్రారంభిస్తే అందులో లక్షల మంది ఉన్నత చదువులు చదువుతున్నారన్నారు. విద్యతోపాటు సైన్స్లో రాణించేలా ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో పరిశోధనల ద్వారా మంచి అవకాశాలు వస్తున్నాయన్నారు. గిరిజన విద్యార్థులను అన్ని రంగాలలో ప్రోత్సహిస్తున్నట్లు మాజీ ఎంపీ నగేశ్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. విద్యార్థుల సమస్యలను వెంట వెంటనే పీవో పరిష్కరిస్తున్నారని పేర్కొన్నారు.
ఆకట్టుకున్న ఎగ్జిబిట్స్
ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని 123 ఆశ్రమ పాఠశాలల నుంచి సుమారు 4 వేల మంది సైన్స్ ఫెయిర్ను తిలకించారు. ఇందులో విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ ఆకట్టుకున్నాయి.
వాటర్ వెయిట్ మిషన్పై సరదాగా..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా మోడీ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రూపొందించిన వాటర్ వెయిట్ మిషన్ను మంత్రి ఐకే రెడ్డి పరిశీలించారు. సరదాగా మిషన్పై నిల్చొని బరువు చెప్పాలని విద్యార్థిని అడిగారు. అనంతరం మాజీ ఎంపీ నగేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కూడా తమ బరువును చూసుకున్నారు. నా బరువు అంత లేదమ్మా.. అని ప్రజాప్రతినిధులు విద్యార్థులతో అనగా.. ఆ మిషన్ కచ్చితంగా చూపిస్తుంది సార్ అనడంతో నవ్వులు విరబూశాయి.