తానూర్, ఆగస్టు, 17 : సాహిత్యరత్న అన్నబావుసాటే ఆశయాలను కొనసాగించాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి సూచించారు. మండల కేంఔద్రంలో అన్నబావుసాటే 103వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. అన్నబావుసాటే విగ్రహానికి, చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. అన్నబావుసాటే కమిటీ సభ్యులు ఎమ్మెల్యే విఠల్రెడ్డిని శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల కోసం అన్నబావుసాటే అనేక పోరాటాలు చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు అన్నబావుసాటేకు భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశారని పేర్కొన్నారు.
యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండి సన్మార్గంలో కొనసాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాడేవార్ విఠల్, హంగిర్గా సొసైటీ చైర్మన్ నారాయణ్రావుపటేల్, ఆత్మచైర్మన్ పోతారెడ్డి, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, కోఆప్షన్ మెంబర్ గోవింద్రావుపటేల్, ముథోల్ తాలుకా అన్నబావుసాటే కమిటీ అధ్యక్షుడు ఉత్తం బాలేరావు, ఉపాధ్యక్షుడు నమత్కర్ దిగంబర్, భైంసా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చిలిమ్కర్ గంగాధర్, డిగంబర్పటేల్, సొసైటీ డైరెక్టర్లు హున్గుందే పుండ్లిక్, ఎంపీటీసీ సిరిమొల్లా లక్ష్మణ్, గజానంద్, శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల అధ్యక్షుడు శివాజీరావుపటేల్, మాజీ సర్పంచులు జాదవ్ మాధవ్రావుపటేల్, దార్మోడ్ రాములు, సొసైటీ డైరెక్టర్ లింబాకర్ గంగారామ్, దళిత నాయకులు గణపత్, మాంజ్రీ ఆనంద్రావు, దిగంబర్, తానూర్ అన్నబావుసాటే అధ్యక్షుడు బాలాజీ వాగ్మారే, జయంతి అధ్యక్షుడు చందు, కమిటీ సభ్యులు లాలు, దత్తు, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు పోశెట్టి, బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్, పీరాజీ, భీంపవార్, భగ్వాన్ పవార్, సూర్యకాంత్ పవార్, దార్మోడ్ సుభాష్, కరీం, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
వీఆర్ఏ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
మండల కేంద్రానికి చెందిన వీఆర్ఏ పీర్ అహ్మద్ అనారోగ్యంతో ఈ నెల 13న మృతి చెందాడు. దీంతో అతని కుటుంబాన్ని ఎమ్మెల్యే విఠల్రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్నిచ్చారు. సర్పంచ్ తాడేవార్ విఠల్, ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, హంగిర్గా సొసైటీ చైర్మన్ నారాయణ్రావుపటేల్, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, ఉప సర్పంచ్ నయూమ్, ఉప సర్పంచ్ షాన్వాజ్ఖాన్, మాజీ సర్పంచ్ రాములు, బీఆర్ఎస్ నాయకుడు భీంపవార్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు చంద్రకాంత్యాదవ్ తదితరులున్నారు.